యాప్నగరం

పాక్ ఓపెనర్ అర్ధశతకం.. ఫైనల్‌కి బాటలు

మ్యాచ్‌లో 212 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్ 18 ఓవర్లు ముగిసే

TNN 14 Jun 2017, 8:23 pm
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి పాకిస్థాన్ బాటలు వేసుకుంది. ఇంగ్లాండ్‌తో కార్ఢిఫ్ వేదికగా జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 212 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్ 18 ఓవర్లు ముగిసే సమయానికే వికెట్ నష్టపోకుండా 105 పరుగులతో మెరుగైన స్థితిలో నిలిచింది. ఓపెనర్ జమామ్ (50: 49 బంతుల్లో 6x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు. అతనికి తోడుగా మరో ఓపెనర్ అజహర్ అలీ (42: 56 బంతుల్లో 3x4, 1x6) నిలకడగా ఆడుతుండటంతో పాక్ సాఫీగా గెలుపు దిశగా సాగిపోతోంది.
Samayam Telugu pakistan off to brisk start
పాక్ ఓపెనర్ అర్ధశతకం.. ఫైనల్‌కి బాటలు


అంతకముందు పాకిస్థాన్‌ బౌలర్లు హసన్ అలీ (3/35), జునైద్ ఖాన్ (2/42), రుమాన్ రేస్ (2/44) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 211 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. పాక్ ఓపెనింగ్ జోడిని విడదీసేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ బౌలర్లను వరుసగా మారుస్తున్నా ఫలితం రాబట్టలేకపోతున్నాడు. పాక్ విజయానికి ఇంకా 32 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 10 వికెట్లు ఉండటంతో ఆ జట్టు విజయం నల్లేరుపై నడకే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.