యాప్నగరం

భారత్‌పై 21 ఏళ్ల తర్వాత పాక్‌కి శుభారంభం

అప్పట్లో పాక్ ఓపెనర్లు సయీద్ అన్వర్, అమీర్ సొహైల్ భారత్ బౌలర్లని ఎదుర్కొని 84 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పారు

TNN 18 Jun 2017, 4:18 pm
భారత్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 21 ఏళ్ల తర్వాత మళ్లీ శుభారంభం అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 15 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. ఒక ఐసీసీ టోర్నీలో భారత్‌పై తొలి వికెట్‌కి 84కి పైగా పాక్ ఓపెనర్లు భాగస్వామ్యం నెలకొల్పడం 1996 తర్వాత ఇదే తొలిసారి.
Samayam Telugu pakistan on rampage
భారత్‌పై 21 ఏళ్ల తర్వాత పాక్‌కి శుభారంభం


అప్పట్లో పాక్ ఓపెనర్లు సయీద్ అన్వర్, అమీర్ సొహైల్ భారత్ బౌలర్లని ఎదుర్కొని 84 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మధ్యకాలంలో చాలా సార్లు దాయాది దేశాలు తలపడినా.. పాక్‌కి శుభారంభం లభించలేదు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో కూడా 3 ఓవర్లకి పాక్ 8 పరుగులతో పాక్ నిలిచిన దశలో వికెట్ పడాల్సి ఉంది. కానీ.. జస్‌ప్రీత్ బుమ్రా నోబాల్ వేసి తప్పిదం చేయడంతో ఓపెనర్ ఫకార్ జమాన్‌కి జీవనదానం లభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.