యాప్నగరం

శ్రీలంకపై ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

సెమీస్ చేరాలంటే ఇరు జట్లకి తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో పోరు ఆసక్తికరంగా జరగనుంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌

TNN 12 Jun 2017, 2:50 pm
Samayam Telugu pakistan opt to bowl
శ్రీలంకపై ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫ‌‌రాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సెమీస్ చేరాలంటే ఇరు జట్లకి తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో పోరు ఆసక్తికరంగా జరగనుంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ భారత్‌పై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన శ్రీలంక ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లోనే భారత్ చేతిలో ఓడినా.. తర్వాత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచిన పాక్‌ కూడా ఉత్సాహంగానే బరిలోకి దిగుతోంది.

పాకిస్థాన్ జట్టు: అజహర్ అలీ, పఖార్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్, ఫమీమ్ అష్రఫ్, ఇమాద్ వసీమ్, మహ్మద్ అమీర్, జునైద్ ఖాన్, హసన్ అలీ

శ్రీలంక జట్టు: డిక్వెల్లా, గుణతిలక, కుశాల్ మెండిస్, మాథ్యూస్, గుణరత్నే, డిసిల్వా, దినేశ్ చండిమాల్, తిసార పెరీర, లక్మల్, లసిత్ మలింగ, ప్రదీప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.