యాప్నగరం

అలవోకగా ఫైనల్ చేరిన పాకిస్థాన్

క్రికెట్ ప్రపంచంలో అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతం

TNN 14 Jun 2017, 9:48 pm
Samayam Telugu pakistan reach final for first time
అలవోకగా ఫైనల్ చేరిన పాకిస్థాన్
క్రికెట్ ప్రపంచంలో అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతం చేసింది. టోర్నీలో ఓటమి ఎరుగకుండా సెమీస్ చేరిన ఇంగ్లాండ్‌ని అలవోకగా ఓడించేసి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. కార్ఢిప్ వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓపెనర్లు అజహర్ అలీ (76: 100 బంతుల్లో 5x4, 1x6), జమాన్ (57: 58 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకాలు బాదడంతో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ని చిత్తుగా ఓడించింది.

తొలుత పాకిస్థాన్‌ బౌలర్లు హసన్ అలీ (3/35), జునైద్ ఖాన్ (2/42), రుమాన్ రేస్ (2/44) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 211 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో ఓపెనర్ బారిస్టో( 43: 57 బంతుల్లో 4x4), జో రూట్ (46: 56 బంతుల్లో 2x4), బెన్ స్టోక్స్ (34: 64 బంతుల్లో), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (33: 53 బంతుల్లో 4x4) నిలకడగా ఆడినా.. జట్టుకు మెరుగైన స్కోరు అందించలేకపోయారు. ఛేదనలో పాక్ ఓపెనర్లు శతక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేయగా.. బాబర్ అజామ్ (38 నాటౌట్: 45 బంతుల్లో 2x4, 1x6), మహ్మద్ హఫీజ్ (31 నాటౌట్: 21 బంతుల్లో 3x4, 2x6) చివర్లో గెలుపు లాంఛనాన్ని 37.1 ఓవర్లలో 215/2తో పూర్తి చేశారు.


భారత్, బంగ్లాదేశ్ మధ్య గురువారం జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాకిస్థాన్‌తో ఫైనల్లో ఆదివారం తలపడుతుంది. గ్రూప్-ఎలో అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయించి ఇంగ్లాండ్ ఫైనల్ చేరగా.. గ్రూప్-బిలో భారత్ చేతిలో ఓడి, దక్షిణాఫ్రికా, శ్రీలంకపై గెలిచి పాక్ సెమీస్ చేరడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.