యాప్నగరం

వర్షంతో భారత్- పాక్ మ్యాచ్ నిలిపివేత

భారత ఓపెనర్లు ఎలాంటి సాహసాలకు వెళ్లకుండా అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు

TNN 4 Jun 2017, 3:51 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 9.5 ఓవర్లలో 46/0తో నిలిచిన దశలో వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ (25 నాటౌట్: 34 బంతుల్లో 4x4), శిఖర్ ధావన్ (20 నాటౌట్: 25 బంతుల్లో 1x4) ఉన్నారు.
Samayam Telugu play stopped due to rain
వర్షంతో భారత్- పాక్ మ్యాచ్ నిలిపివేత


ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం లేకపోవడంతో మ్యాచ్ ఉద్వేగంతో జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత ఓపెనర్లు ఎలాంటి సాహసాలకు వెళ్లకుండా అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి ఓవర్ వేసిన మహ్మద్ అమీర్ వరుసగా ఆఫ్ స్టంప్‌కి దూరంగా ప్రమాదకర బంతులు వేయడంతో ఆ ఓవర్‌లో రోహిత్ కనీసం ఒక పరుగు కూడా రాబట్టలేకపోయాడు. తర్వాత ఓవర్లలో కూడా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్న ఓపెనర్లు గతి తప్పిన బంతుల్ని మాత్రమే బౌండరీకి తరలిస్తూ.. స్కోరు బోర్డును నడిపిస్తున్నారు. వర్షం కారణంగా ఎక్కువ సేపు ఆటకి అంతరాయం ఏర్పడితే ఓవర్లను కుదించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.