యాప్నగరం

పాక్‌పై అర్ధ శతకాలు బాదేసిన ఓపెనర్లు

భావోద్వేగాలతో నిండిన మ్యాచ్ కావడంలో ఆరంభంలో ఈ ఓపెనింగ్ జోడి ఆచితూచి బ్యాటింగ్ చేసింది.

TNN 4 Jun 2017, 5:23 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జట్టుకు మెరుపు ఆరంభమిచ్చారు. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన షదబ్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్‌తో రోహిత్ శర్మ(62: 80 బంతుల్లో 6x4, 1x6) అర్ధ శతకాన్ని పూర్తి చేసుకోగా.. తర్వాత ఓవర్ వేసిన రియాజ్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదేసిన శిఖర్ ధావన్ (63: 59 బంతుల్లో 5x4, 1x6) కూడా 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వీరిద్దరి జోరుతో భారత్ 23 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 129 పరుగులతో భారీ స్కోరుకు బాటలు వేసుకుంది.
Samayam Telugu rohit and dhawan run pakistan ragged
పాక్‌పై అర్ధ శతకాలు బాదేసిన ఓపెనర్లు


భావోద్వేగాలతో నిండిన మ్యాచ్ కావడంలో ఆరంభంలో ఈ ఓపెనింగ్ జోడి ఆచితూచి బ్యాటింగ్ చేసింది. దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 46 మాత్రమే. కానీ.. ఆ తర్వాత క్రమంగా రోహిత్ శర్మ బ్యాట్ ఝళిపించగా.. మరో ఎండ్‌లో శిఖర్ ధావన్ కూడా అందుకున్నాడు. దీంతో పాకిస్థాన్ బౌలర్లకి బౌండరీల మోత తప్పలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.