యాప్నగరం

పాక్‌తో మెయిడిన్.. లంకపై ఫోర్‌తో మొదలు

లసిత్ మలింగ వేసిన తొలి ఓవర్ మొదటి బంతినే కవర్స్ దిశగా రోహిత్ శర్మ బౌండరీకి తరలించి

TNN 8 Jun 2017, 3:39 pm
ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఒత్తిడిలో ఆరంభించిందా..? పాకిస్థాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా రిలాక్స్ అయిపోందా..? వీటన్నింటికీ శ్రీలంకతో గురువారం జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఒక షాట్‌తో సమాధానమిచ్చాడు. పేసర్ లసిత్ మలింగ వేసిన తొలి ఓవర్ మొదటి బంతినే కవర్స్ దిశగా రోహిత్ శర్మ బౌండరీకి తరలించి భారత్ పరుగుల ఖాతా తెరిచాడు.
Samayam Telugu rohit sharma starts with boundary
పాక్‌తో మెయిడిన్.. లంకపై ఫోర్‌తో మొదలు


పాకిస్థాన్‌తో గత ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో.. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో కనీసం ఒక బంతిని కూడా రోహిత్ సాధికారికంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. షార్ట్ పిచ్‌ రూపంలో ఆఫ్ స్టంప్‌కి దూరంగా అమీర్ బంతులు విసురుతుంటే.. ఒత్తిడిలో రోహిత్ షాట్ కొట్టేందుకు ప్రయత్నిస్తూ వరుసగా విఫలమయ్యాడు. దీంతో ఆ ఓవర్‌ మెయిడిన్‌గా ముగిసి రోహిత్‌తో పాటు భారత్‌ని కాసేపు ఒత్తిడిలో పడేసింది. తాజాగా మలింగ కూడా ఆఫ్ స్టంప్‌కి దూరంగా తొలి బంతి విసిరితే.. కళాత్మక రీతిలో రోహిత్ బౌండరీ కొట్టి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని తలపించాడు. ఎంతైనా.. దాయాదుల మధ్య పోరు భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది కదా..? ఒత్తిడి సహజమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.