యాప్నగరం

సెమీస్‌లో శతకం బాదిన రోహిత్ శర్మ

265 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సెంచరీ చేయడంతో భారత్ 33 ఓవర్లు ముగిసే సమయానికి 212/1తో మ్యాచ్‌పై ..

TNN 15 Jun 2017, 9:20 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ శతకంతో చెలరేగాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 111 బంతుల్లో రోహిత్ శర్మ 12x4, 1x6 సాయంతో 102 పరుగులు చేశాడు. కెరీర్‌లో రోహిత్‌కి ఇది 11వ శతకం కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటిదే కావడం విశేషం.
Samayam Telugu rohit slams 11th odi ton
సెమీస్‌లో శతకం బాదిన రోహిత్ శర్మ


265 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సెంచరీ చేయడంతో భారత్ 33 ఓవర్లు ముగిసే సమయానికి 212/1తో మ్యాచ్‌పై పట్టు బిగించేసింది. ఇన్నింగ్స్ 33వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో లాంగ్ లెగ్ దిశగా సిక్స్ బాది రోహిత్ శతకం మైలురాయిని అందుకున్నాడు. షార్ట్ పిచ్ రూపంలో పడిన బంతిని.. కళ్లు చెదిరే రీతిలో బౌండరీ లైన్ దాటించాడు. ఛేదనలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్.. అనంతరం కెప్టెన్ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ని నడిపిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.