యాప్నగరం

టీమిండియా వీరాభిమానికి వీసా కష్టాలు

మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతున్నా శమ్రకోర్చి గత కొన్నేళ్లుగా సుధీర్ అక్కడికి

TNN 29 May 2017, 8:22 pm
భారత క్రికెట్ జట్టు వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు ఎదురయ్యాయి. టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి జట్టును ప్రోత్సహించే సుధీర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించగా వీసా సమస్య ఎదురైంది. దీంతో సుధీర్ తన అభిమాన క్రికెటర్ సచిన్‌ని ఆశ్రయించగా.. తెందుల్కర్ స్వయంగా వీసా ఆఫీస్‌కి లేఖ రాశాడు.
Samayam Telugu sachin tendulkar helps sudhir
టీమిండియా వీరాభిమానికి వీసా కష్టాలు


‘భారత్ జట్టుకి సుధీర్ వీరాభిమాని. ఇంకా చెప్పాలంటే అతను టీమిండియాకి అనధికార ప్రచారకర్త. మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతున్నా శమ్రకోర్చి గత కొన్నేళ్లుగా సుధీర్ అక్కడికి వెళుతూ ఆటగాళ్లతో ఉత్సాహం నింపుతున్నాడు. అతను పేదరికం నుంచి వచ్చినా.. క్రికెట్‌పై ఉన్న పిచ్చి ప్రేమతో సొంత ఖర్చులపై స్టేడియానికి వెళ్తున్నాడు. అతని అభిమానానికి అడ్డు చెప్పకండి’ అంటూ సచిన్ లేఖలో సూచించాడు. ఈ లేఖతో ఫాస్ట్ ట్రాక్ వీసా కోసం సుధీర్ దరఖాస్తు చేసుకోగా.. రూ.26వేలు చెల్లించుకోవాల్సి వచ్చింది. సాధారణ వీసాకి అయ్యే ఖర్చు రూ.7,500 మాత్రమే. జూన్ 1 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుండగా.. భారత్ జూన్ 4న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో ఢీకొనబోతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.