యాప్నగరం

ఇండియా-పాక్ మ్యాచ్.. బరిలో దిగనున్న సచిన్!

ఉత్కంఠకు మారుపేరయిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు మరో అదనపు ఆకర్షణ తోడు కానుంది. ఈ మ్యాచ్‌లో సచిన్ తొలిసారిగా కామెంట్రీ..

TNN 3 Jun 2017, 12:30 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో సచిన్ టెండుల్కర్ బరిలో దిగనున్నాడు. క్రికెట్ దేవుడిగా.. అభిమానుల నీరాజనాలు అందుకున్న సచిన్.. తొలిసారిగా కామెంటేటర్‌ అవతారం ఎత్తనున్నాడు. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో సచిన్ వ్యాఖ్యాతగా మారనున్నాడు. ఇందుకోసం స్టార్ స్పోర్ట్స్ మాస్టర్ బ్లాస్టర్‌కు కళ్లు చెదిరే మొత్తాన్ని ముట్టజెప్పనుంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం సచిన్ కామెంట్రీ హిందీలోనే ఉండనుందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ప్రసారమయ్యే ఇంగ్లిష్ కామెంట్రీ కోసం సచిన్‌తో ఒప్పందం కుదుర్చుకోలేదని తెలుస్తోంది.
Samayam Telugu sachin tendulkar to make commentary debut
ఇండియా-పాక్ మ్యాచ్.. బరిలో దిగనున్న సచిన్!


కామెంట్రీ బాక్స్‌లో మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీలతోపాటు వీరేంద్ర సెహ్వాగ్‌తో సచిన్ గొంతు కలపనున్నాడు. సబా కరీం కూడా కామెంట్రీ కోసం ఇంగ్లాండ్ వెళ్లగా.. పాకిస్థాన్‌ నుంచి కూడా ఇద్దరు కామెంటేటర్లు వీరితో జత కలిసే అవకాశం ఉంది.

సచిన్ కామెంట్రీ గురించి స్టార్ ప్రతినిధులెవరూ స్పందించలేదు. ఈ విషయమై సచిన్‌ను సంప్రదించేందుకు ముంబై మిర్రర్ ప్రయత్నించగా.. అప్పటికే అతడు ఇంగ్లాండ్ ఫ్లయిట్ ఎక్కేశాడు. సచిన్ ఎక్స్‌పర్ట్స్ ప్యానెల్‌లో మాత్రమే భాగం. లైవ్ కామెంట్రీలో కాదు అని కొందరు వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.