యాప్నగరం

పాక్ కూడా సెమీస్‌కి వచ్చేసిందోచ్..!

237 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ ఒకానొక దశలో 162/7తో ఓటమి అంచున నిలిచింది. కానీ.. కెప్టెన్

TNN 12 Jun 2017, 11:39 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనాల్లేకుండా బరిలోకి దిగిన పాకిస్థాన్ సెమీస్ బెర్త్ కొట్టేసింది. శ్రీలంకతో సోమవారం జరిగిన అమీతుమీ మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో అనూహ్య విజయాన్ని అందుకుంది. 237 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ ఒకానొక దశలో 162/7తో ఓటమి అంచున నిలిచింది. కానీ.. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (61 నాటౌట్: 79 బంతుల్లో 5x4) టెయిలెండర్ మహ్మద్ అమీర్ (28 నాటౌట్: 43 బంతుల్లో 1x4)తో కలిసి పట్టుదలతో చివరి వరకూ పోరాడి జట్టును గెలిపించుకున్నాడు.
Samayam Telugu sarfraz takes pakistan to ct semis
పాక్ కూడా సెమీస్‌కి వచ్చేసిందోచ్..!


శ్రీలంక ఫీల్డర్ల తప్పిదాలను సొమ్ము చేసుకున్న ఈ జోడి 8వ వికెట్‌కి 75 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో పాక్ 44.5 ఓవర్లలో 237/7తో విజయాన్ని అందుకుంది. అంతకముందు పాకిస్థాన్ బౌలర్లు జునైద్ ఖాన్ (3/36), మహ్మద్ అమీర్ (2/40) ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 236 పరుగులకే కుప్పకూలిపోయింది. ఓపెనర్ డిక్వెల్లా (73: 86 బంతుల్లో 4x4) ఒక్కడే అర్ధశతకంతో ఫర్వాలేదనిపించాడు.

టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్‌తో తొలి సెమీ ఫైనల్‌లో బుధవారం పాకిస్థాన్ తలపడనుండగా.. బంగ్లాదేశ్‌ని గురువారం భారత్ రెండో సెమీ ఫైనల్‌లో ఢీకొంటుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.