యాప్నగరం

ప్రత్యర్థి కెప్టెన్లతో కోహ్లి డిన్నర్..!

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోన్న భారత్ జట్టు ఆదివారం పాకిస్థాన్‌తో తన తొలి మ్యాచ్‌లో

TNN 31 May 2017, 5:42 pm
ఇంగ్లాండ్ వేదికగా జూన్ 1 నుంచి ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్ల కెప్టెన్లకి ఐసీసీ ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. అయితే వివిధ కారణాలతో నాలుగు జట్ల కెప్టెన్లు ఈ విందుకు గైర్హాజరవగా.. భారత్ (విరాట్ కోహ్లి), దక్షిణాఫ్రికా (ఏబీ డివిలియర్స్), ఇంగ్లాండ్ (మోర్గాన్), బంగ్లాదేశ్ (మోర్తజా) కెప్టెన్లు మాత్రమే హాజరయ్యారు. ఐసీసీ ప్రతినిధి టోర్నీ విధి విధానాలను కెప్టెన్లకి వివరించారు.
Samayam Telugu virat kohli attends opening dinner with other captains
ప్రత్యర్థి కెప్టెన్లతో కోహ్లి డిన్నర్..!


టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య ఇంగ్లాండ్‌తో బంగ్లాదేశ్ తలపడనుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోన్న భారత్ జట్టు ఆదివారం పాకిస్థాన్‌తో తన తొలి మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ పోరు‌లో నిలుస్తున్నాయి. గ్రూప్-ఎ‌లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఉండగా.. గ్రూప్- బిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ప్రతి జట్టు గ్రూపులోని మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. చివరికి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కి అర్హత సాధిస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.