యాప్నగరం

ఒక మ్యాచ్‌లో ఫెయి‌ల్ అయితే తప్పించాలా..?

ఫైనల్లో భారత్ జట్టు ఒకవేళ ఛేదనకు దిగి.. ఓవర్‌కి 8 పరుగులు చేయాల్సిన దశలో ప్రధాన వికెట్లు కోల్పోతే..? హార్దిక్ పాండ్య

TNN 18 Jun 2017, 1:16 pm
పాకిస్థాన్‌తో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌‌కి తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి పరోక్షంగా వెల్లడించాడు. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఆదివారం ఈ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో కోహ్లి మాట్లాడుతుండగా.. బంగ్లాదేశ్‌తో సెమీస్‌ మ్యాచ్‌లో విఫలమైన హార్దిక్ పాండ్య‌పై వేటు పడబోతుందా..? అని విలేకర్లు ప్రశ్నించగా.. అలాంటి ఆలోచన తనకు లేదని కెప్టెన్ స్పష్టం చేశాడు.
Samayam Telugu virat kohli hints at unchanged playing xi vs pakistan
ఒక మ్యాచ్‌లో ఫెయి‌ల్ అయితే తప్పించాలా..?


‘ఫైనల్లో భారత్ జట్టు ఒకవేళ ఛేదనకు దిగి.. ఓవర్‌కి 8 పరుగులు చేయాల్సిన దశలో ప్రధాన వికెట్లు కోల్పోతే..? హార్దిక్ పాండ్య లాంటి ఆల్‌రౌండర్ మ్యాచ్‌ని రక్షిస్తాడు. మాకు అతని శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంది. అతను బంతి, బ్యాట్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ రాణించగల సమర్థుడు. అదీ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో జట్టులో మార్పు చేయాలని మేము భావించడం లేదు’ అని కోహ్లి స్పష్టం చేశాడు.

పాకిస్థాన్‌పై తప్పకుండా భారత్ గెలుస్తుందని మీరు ఆశిస్తున్నారా..? అని ప్రశ్నించగా.. ‘ఒక జట్టుపై ప్రతిసారి విజయం సాధిస్తామని లేదా ఓడిపోతామనే గ్యారంటీ ఉండదు. ఆదివారం ఏ జట్టు బాగా ఆడితే అది గెలుపొందుతుంది. గత చరిత్రను మేము పరిగణలోకి తీసుకోవడం లేదు’ అని కోహ్లి వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.