భారత్ జట్టుకి తదుపరి ప్రధాన కోచ్గా ఎవరుండాలో క్రికెట్ సలహా కమిటీని కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లి తేల్చి చెప్పేశాడట. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మే నెల చివర్లో ఇంగ్లాండ్కి వెళ్లేముందే కమిటీ సభ్యులైన సచిన్ తెందుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్తో కోహ్లి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జట్టు కోచ్గా ఉన్న అనిల్ కుంబ్లే ఒప్పందం ఈ ఛాంపియన్స్ ట్రోఫీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కోచ్ పోస్ట్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
జట్టు ప్రధాన కోచ్ని ఎంపిక చేసే బాధ్యతను సచిన్, గంగూలీ, లక్ష్మణ్తో కూడిన క్రికెట్ సలహా కమిటీకి బీసీసీఐ మరోసారి అప్పగించింది. కెప్టెన్ కోహ్లితో అనిల్ కుంబ్లేకి ప్రస్తుతం విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కుంబ్లేని కొనసాగించే అవకాశాలు లేవనే చెప్పాలి. కోచ్ పదవిని ఆశిస్తూ వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, దూడ గణేశ్, లాల్ చంద్ రాజ్పుత్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రస్తుతం దరఖాస్తులు పరిశీలించిన కమిటీ ఇంగ్లాండ్లోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తోంది. అయితే.. విరాట్ కోహ్లి మాత్రం కోచ్గా రవిశాస్త్రి పేరును గత నెలలో కమిటీకి సూచించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ.. ఈ అభ్యర్థనను కమిటీ తిరస్కరించిందని.. కోహ్లి మాటను కేవలం సూచనకే పరిమితం చేసినట్లు సమాచారం. అనూహ్యంగా రవిశాస్త్రి కనీసం దరఖాస్తు కూడా చేసుకోకపోవడం కొసమెరుపు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసేలోపు భారత్ కోచ్పై కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రధానంగా టామ్ మూడీ, సెహ్వాగ్ పేర్లు వినిపిస్తున్నాయి.
జట్టు ప్రధాన కోచ్ని ఎంపిక చేసే బాధ్యతను సచిన్, గంగూలీ, లక్ష్మణ్తో కూడిన క్రికెట్ సలహా కమిటీకి బీసీసీఐ మరోసారి అప్పగించింది. కెప్టెన్ కోహ్లితో అనిల్ కుంబ్లేకి ప్రస్తుతం విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కుంబ్లేని కొనసాగించే అవకాశాలు లేవనే చెప్పాలి. కోచ్ పదవిని ఆశిస్తూ వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, దూడ గణేశ్, లాల్ చంద్ రాజ్పుత్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రస్తుతం దరఖాస్తులు పరిశీలించిన కమిటీ ఇంగ్లాండ్లోనే ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తోంది. అయితే.. విరాట్ కోహ్లి మాత్రం కోచ్గా రవిశాస్త్రి పేరును గత నెలలో కమిటీకి సూచించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ.. ఈ అభ్యర్థనను కమిటీ తిరస్కరించిందని.. కోహ్లి మాటను కేవలం సూచనకే పరిమితం చేసినట్లు సమాచారం. అనూహ్యంగా రవిశాస్త్రి కనీసం దరఖాస్తు కూడా చేసుకోకపోవడం కొసమెరుపు. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసేలోపు భారత్ కోచ్పై కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రధానంగా టామ్ మూడీ, సెహ్వాగ్ పేర్లు వినిపిస్తున్నాయి.