యాప్నగరం

క్రికెట్ దిగ్గజాలపై సెహ్వాగ్ ‘నిద్ర’ కౌంటర్..!

బిజీ షెడ్యూల్ కారణంగా కామెంట్రీ బాక్స్‌లో దొరికిన కొద్ది విశ్రాంతి సమయాన్ని ఈ దిగ్గజ క్రికెటర్లు నిద్రకు కేటాయించగా.

TNN 5 Jun 2017, 3:26 pm
క్రికెట్ నుంచి రెండేళ్ల క్రితమే వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తీసుకున్నా.. తన చమత్కారంతో అభిమానుల్ని నేటికీ అలరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఈ భారత మాజీ ఓపెనర్ పేల్చే పంచ్‌లకి కొదవలేదు. తాజాగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సెహ్వాగ్.. తనతో పాటు కామెంట్రీ బాక్స్‌ని పంచుకుంటున్న క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, షేన్ వార్న్‌లపై ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.
Samayam Telugu virender sehwag finds way to troll
క్రికెట్ దిగ్గజాలపై సెహ్వాగ్ ‘నిద్ర’ కౌంటర్..!


బిజీ షెడ్యూల్ కారణంగా కామెంట్రీ బాక్స్‌లో దొరికిన కొద్ది విశ్రాంతి సమయాన్ని ఈ దిగ్గజ క్రికెటర్లు నిద్రకు కేటాయించగా.. తన మొబైల్‌తో ఫొటోలు తీసిన సెహ్వాగ్ వాటిని అభిమానులతో పంచుకున్నాడు. ‘కలలతోనే భవిష్యత్‌ని తీర్చిదిద్దుకుంటాం. ఈ క్రికెట్ దిగ్గజాలు ఇప్పటికీ తమ సమయాన్ని వృథా చేయకుండా కలలు కంటున్నారు’ అంటూ రాసుకొచ్చాడు.

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 2007లో ఆటకి వీడ్కోలు చెప్పగా.. 2008లో గంగూలీ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌‌కి ఎంపిక చేయకపోవడంతో వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.