ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సమీపిస్తున్నకొద్దీ ఇరుదేశాల మాజీ క్రికెటర్లు తమ మద్దతు ప్రకటిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ ఈ మెగా టోర్నీ గురించి మాట్లాడుతూ భారత్ తొలి మ్యాచ్లోనే పాకిస్థాన్ని ఓడించి.. అదే ఆత్మవిశ్వాసంతో టైటిల్ని నిలబెట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2013లో చివరిసారి జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
‘ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందని నా నమ్మకం. ఇటీవల ముగిసిన రెండు వార్మప్ మ్యాచ్ల్లోనూ చాలా బాగా ఆడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫామ్ అందుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంగ్లాండ్ పిచ్లపై చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో దినేశ్ కార్తీక్ తనకి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బౌలర్లు కూడా రెండు మ్యాచ్ల్లోనూ గెలిపించే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జూన్ 4న జరిగే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వార్మప్ మ్యాచ్ల్లో ప్రదర్శించిన సమష్టి ఆటతీరును భారత్ జట్టు టోర్నీలో కూడా కొనసాగించగలిగితే కచ్చితంగా పాక్ను ఓడించడమే కాదు.. మళ్లీ టైటిల్ విజేతగా అవకాశం మెండుగా ఉంటుంది’ అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంకానుండగా.. భారత్ ఆదివారం పాకిస్తాన్తో తన తొలి మ్యాచ్ ఢీకొట్టనుంది.
‘ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందని నా నమ్మకం. ఇటీవల ముగిసిన రెండు వార్మప్ మ్యాచ్ల్లోనూ చాలా బాగా ఆడింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫామ్ అందుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంగ్లాండ్ పిచ్లపై చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో దినేశ్ కార్తీక్ తనకి దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బౌలర్లు కూడా రెండు మ్యాచ్ల్లోనూ గెలిపించే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జూన్ 4న జరిగే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వార్మప్ మ్యాచ్ల్లో ప్రదర్శించిన సమష్టి ఆటతీరును భారత్ జట్టు టోర్నీలో కూడా కొనసాగించగలిగితే కచ్చితంగా పాక్ను ఓడించడమే కాదు.. మళ్లీ టైటిల్ విజేతగా అవకాశం మెండుగా ఉంటుంది’ అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభంకానుండగా.. భారత్ ఆదివారం పాకిస్తాన్తో తన తొలి మ్యాచ్ ఢీకొట్టనుంది.