ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బ్యాట్స్మెన్ చేతిలో ఊచకోతకి గురైన పాకిస్థాన్ బౌలర్ వాహబ్ రియాజ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆదివారం ముగిసిన మ్యాచ్లో 8.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన రియాజ్ ఏకంగా 87 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే ఈ బౌలర్ని శిఖర్ ధావన్ లక్ష్యంగా చేసుకుని హ్యాట్రిక్ ఫోర్లు బాదేయగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్లు చుక్కలు చూపించేశారు. దీంతో లయ తప్పిన రియాజ్.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్ చేసే సమయంలో పట్టుతప్పి కింద పడిపోయాడు.
‘రియాజ్ కాలికి గాయమైంది. అతను కోలుకోవడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని స్కానింగ్ అనంతరం వైద్యులు తెలిపారు. దీంతో అతను ఛాంపియన్స్ ట్రోఫీలోని మిగతా మ్యాచ్లకి దూరంకానున్నాడు. రియాజ్ స్థానంలో ఎవరిని తీసుకునేది త్వరలోనే వెల్లడిస్తాం’ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం పాకిస్థాన్ తన రెండో మ్యాచ్ తలపడనుంది.
‘రియాజ్ కాలికి గాయమైంది. అతను కోలుకోవడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని స్కానింగ్ అనంతరం వైద్యులు తెలిపారు. దీంతో అతను ఛాంపియన్స్ ట్రోఫీలోని మిగతా మ్యాచ్లకి దూరంకానున్నాడు. రియాజ్ స్థానంలో ఎవరిని తీసుకునేది త్వరలోనే వెల్లడిస్తాం’ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం పాకిస్థాన్ తన రెండో మ్యాచ్ తలపడనుంది.