యాప్నగరం

కోహ్లిసేనని ఎదుర్కొనేందుకు మేము సిద్ధం..!

ఛాంపియన్స్ ట్రోఫీ‌లో టీమిండియాపై ఆధిపత్యం చెలాయించిన చరిత్ర మాకు ఉంది. అయితే భారత్ బౌలింగ్

TNN 31 May 2017, 8:27 pm
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జట్టును ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ ధీమా వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోన్న భారత్ తన తొలి మ్యాచ్‌లోనే ఆదివారం పాకిస్థాన్‌ని ఢీకొట్టనుంది. ప్రపంచకప్‌లో పదిసార్లు ఈ రెండు జట్లు తలపడగా.. భారత్ తొమ్మిదింట్లో గెలుపొంది ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం మూడు సార్లు ఢీకొట్టిన భారత్ రెండింట్లో పరాజయాన్ని మూటగట్టుకుంది.
Samayam Telugu were prepared to face india azhar ali
కోహ్లిసేనని ఎదుర్కొనేందుకు మేము సిద్ధం..!


‘చాలా రోజుల తర్వాత భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో టీమిండియాపై ఆధిపత్యం చెలాయించిన చరిత్ర మాకు ఉంది. అయితే భారత్ బౌలింగ్ విభాగం గతంలో పోలిస్తే చాలా మెరుగైంది. ప్రస్తుతం ఆ జట్టు మంచి పేస్ బౌలర్లు ఉన్నారు. అయితే మా బలం కూడా మాకు తెలుసు. దానికి తగినట్లుగా వారి బౌలింగ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాం. ప్రతి జట్టు కూడా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే ఆశిస్తుంది. కానీ.. అంతర్జాతీయ క్రికెట్లో ఏదీ అంత సులుభం కాదు. భారత్‌తో పోరుకి తుది జట్టుపై ఇంకా స్పష్టత రాలేదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఎవరిపై నమ్మకం ఉంచుతుందో చూడాలి’ అని అజహర్ అలీ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.