ఛాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్లు రద్దయితే.. మరికొన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితం తేలాయి. ప్రస్తుతం టోర్నీ సెమీస్ దశకు వచ్చేసింది. ఆతిథ్య ఇంగ్లాండ్తో బుధవారం పాకిస్థాన్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో ఢీకొంటుండగా.. భారత్తో గురువారం రెండో సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ తలపడనుంది. భారీ అంచనాల మధ్య టోర్నీకి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు వర్షం కారణంగా సెమీస్ అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దవడంతో ప్రత్యర్థితో కలిసి పాయింట్లు పంచుకుంది. లీగ్ దశ సరే.. సెమీస్ మ్యాచ్లకి వరుణుడు అడ్డుపడితే.. ఫలితం ఎలా..?
ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మ్యాచ్లకి రిజర్వ్ డే లేదు. సెమీస్లో కనీసం 20 ఓవర్లు ఆట సాధ్యంకాని నేపథ్యంలో లీగ్ దశలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. మూడు మ్యాచ్ల్లో రెండింట్లో గెలిచిన భారత్ 4 పాయింట్లతో గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత పాకిస్థాన్ కూడా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి 4 పాయింట్లతో రెండో స్థానంలో లీగ్ దశను ముగించింది. భారత్తో పోలిస్తే నెట్ రన్రేట్ పాక్కు తక్కువగా ఉంది.
గ్రూప్- ఎలో మూడు మ్యాచ్ల్లోనూ గెలుపొందిన ఇంగ్లాండ్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. తర్వాత స్థానంలో ఒక మ్యాచ్ విజయం, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో మూడు పాయింట్లతో బంగ్లాదేశ్ నిలిచింది. ఒకవేళ వర్షం కారణంగా రెండు సెమీస్ మ్యాచ్లు రద్దయితే భారత్, ఇంగ్లాండ్ ఫైనల్ చేరతాయి. ఫైనల్కి కూడా రిజర్వ్ డే లేని నేపథ్యంలో 20 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే ఇరుజట్లని సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ మ్యాచ్లకి రిజర్వ్ డే లేదు. సెమీస్లో కనీసం 20 ఓవర్లు ఆట సాధ్యంకాని నేపథ్యంలో లీగ్ దశలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. మూడు మ్యాచ్ల్లో రెండింట్లో గెలిచిన భారత్ 4 పాయింట్లతో గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత పాకిస్థాన్ కూడా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి 4 పాయింట్లతో రెండో స్థానంలో లీగ్ దశను ముగించింది. భారత్తో పోలిస్తే నెట్ రన్రేట్ పాక్కు తక్కువగా ఉంది.
గ్రూప్- ఎలో మూడు మ్యాచ్ల్లోనూ గెలుపొందిన ఇంగ్లాండ్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. తర్వాత స్థానంలో ఒక మ్యాచ్ విజయం, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో మూడు పాయింట్లతో బంగ్లాదేశ్ నిలిచింది. ఒకవేళ వర్షం కారణంగా రెండు సెమీస్ మ్యాచ్లు రద్దయితే భారత్, ఇంగ్లాండ్ ఫైనల్ చేరతాయి. ఫైనల్కి కూడా రిజర్వ్ డే లేని నేపథ్యంలో 20 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే ఇరుజట్లని సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.