యాప్నగరం

IND vs WI: 1983లో భారత్‌ గెలుపునకి ఆ మ్యాచ్ ఊపిరి

36 ఏళ్ల క్రితం మాంచెస్టర్ స్టేడియంలోనే భారత్ జట్టు ప్రపంచకప్ ప్రయాణం మొదలైంది. తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌తో తలపడ్డాం. అప్పటి వరకూ వరల్డ్‌కప్‌లో ఒక్కసారి కూడా విండీస్‌ని భారత్ ఓడించలేదు. కానీ..? -రవిశాస్త్రి

Samayam Telugu 25 Jun 2019, 9:48 pm

ప్రధానాంశాలు:

  • ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన 1983 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్
  • ఆ వరల్డ్‌కప్‌లో భారత్ ప్రయాణాన్ని నెమరువేసుకున్న రవిశాస్త్రి
  • భారత్ ఆ ప్రపంచకప్‌ గెలిచి జూన్ 25 నాటికి 36 ఏళ్లు
  • వెస్టిండీస్‌ని తొలి మ్యాచ్‌లో ఓడించడం కీలక మలుపని వెల్లడి
  • గురువారం భారత్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu 1983 World Cup,Ravi Shastri
ప్రపంచకప్‌లో 36 ఏళ్ల క్రితం వెస్టిండీస్ జట్టుని ఓడించడం భారత్ జట్టు వైఖరినే మార్చేసిందని టీమిండియా కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ వేదికగా 1983లో జరిగిన ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే గెలుపొందిన భారత్ జట్టు.. ఆఖరికి ఫైనల్లోనూ విండీస్‌ని మట్టికరిపించి తొలిసారి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి భారత్ జట్టు తొలి ప్రపంచకప్‌ గెలిచి 36 ఏళ్లు అయిన సందర్భంగా.. అప్పటి టీమ్‌లో సభ్యుడైన రవిశాస్త్రి.. ఆ జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.

ఇంగ్లాండ్ వేదికగానే ప్రస్తుతం ప్రపంచకప్ జరుగుతుండగా.. భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం మధ్యాహ్నం మాంచెస్టర్‌ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే టీమ్‌తో కలిసి అక్కడికి చేరుకున్న రవిశాస్త్రి మాట్లాడుతూ ‘1983 వేసవి కాలంలో ఈ స్టేడియంలోనే భారత్ జట్టు ప్రపంచకప్ ప్రయాణం మొదలైంది. తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌తో తలపడ్డాం. అప్పటి వరకూ వరల్డ్‌కప్‌లో ఒక్కసారి కూడా విండీస్‌ని భారత్ ఓడించలేదు. కానీ.. ఆ మ్యాచ్‌లో వారికి ఓటమి రుచి చూపించాం. దాంతో.. ఇక ఏ జట్టునైనా మేము ఓడించగలమనే ఆత్మవిశ్వాసం పెరిగింది. విండీస్‌పై మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించిన తర్వాత భారత్ జట్టుకి టోర్నీలో తిరుగులేకుండా పోయింది. ఒకరకంగా చెప్పాలంటే భారత్ జట్టు ముఖచిత్రానే ఆ గెలుపు మార్చేసింది’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

వెస్టిండీస్‌తో మ్యాచ్‌ జరిగిన రెండు వారాల తర్వాత మళ్లీ భారత్.. టోర్నీ ఫైనల్లో ఆ జట్టుతోనే తలపడాల్సి వచ్చింది. అయితే.. అప్పటికే ఒకసారి ఓడించి ఉన్న నేపథ్యంలో.. ఫైనల్లోనూ తిరుగులేని ప్రదర్శన కనబర్చిన భారత్.. తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత 2011 ప్రపంచకప్‌లోనూ భారత్ జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.