యాప్నగరం

IND vs NZ: డక్‌వర్త్ లూయిస్ మెథడ్‌పై ఆనంద్ మహీంద్ర అదిరిపోయే ట్వీట్

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న సెమీస్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచింది. దీంతో అందరూ డీఎల్‌ఎస్ ప్రకారం టీమిండియా ఎన్ని పరుగులు చేయాలో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో డక్‌వర్త్ లూయిస్ మెథడ్‌పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ చేశారు.

Samayam Telugu 9 Jul 2019, 9:43 pm
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసిన దశలో మ్యాచ్ నిలిచిపోయింది. మ్యా చ్ ఆగిపోతే ఏమవుతుందనే ఉత్కంఠ అభిమానుల్లో ఏర్పడింది. ఇక కివీస్ బ్యాటింగ్ చేయడం సాధ్యపడకపోతే.. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ టార్గెట్ 46 ఓవర్లలో 237 పరుగులు కానుంది. 20 ఓవర్లు మాత్రమే సాధ్యపడితే.. కోహ్లిసేన విజయం కోసం 148 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 46 ఓవర్ల మ్యాచ్ కొనసాగించడానికి అంపైర్లు నిర్ణయించి.. 20 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 60-70 పరుగులు చేసిన టైంలో వర్షం పడితే.. విజయం మనదే కానుంది.
Samayam Telugu anand mahindra


క్రికెట్ ఆడేవారికే డక్ వర్త్ లూయిస్ మెథడ్ ఓ పట్టాన అర్థం కాదు. అలాంటిది మన లాంటోళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ విజయానికి ఎన్ని ఓవర్లలో ఎన్ని పరుగులు చేయాలో చెబుతూ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశారు.
దీనికి బదులిచ్చిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా... ఇదంతా క్రేజీగా ఉంది. డక్ వర్త్ లూయిస్ మెథడ్ ఏంటో నాకు ఇప్పటి వరకూ అర్థం కాలేదు. అందులో పీహెచ్‌డీ చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. దల్విందర్-లల్వానీ-సుబ్రమణియన్ మెథడ్‌ను క్రియేట్ చేయడానికి ఇదే సరైన తరుణం అని అనుకుంటున్నా. ఇది సరిగ్గా నప్పుతుందేమోనని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు స్పందించిన హర్షా భోగ్లే.. ఒక్క ట్వీట్‌లో 280 పదాల్లో దీన్ని వివరించడం కష్టం. కానీ కార్పోరేట్ సామ్రాజ్యాన్ని నడిపినంత కష్టం మాత్రం కాదని బదులిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.