యాప్నగరం

పాక్‌తో మ్యాచ్‌పై స్పందించిన విరాట్ కోహ్లి

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ భావోద్వేగాలతో కూడుకున్నది. కానీ.. అభిమానుల తరహాలో మేము ఆ మ్యాచ్‌ని చూడటం లేదు. మైదానం వెలుపల ఎలా ఉన్నా.. మ్యాచ్‌ కోసం గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మేము ప్రొఫెషనల్‌గా ఆడతాం. -విరాట్ కోహ్లి

Samayam Telugu 24 May 2019, 1:14 pm

ప్రధానాంశాలు:

  • ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రపంచకప్ మొదలు
  • జూన్ 16న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
  • ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ భారత్‌పై గెలవని పాకిస్థాన్
  • అభిమానుల తరహాలో పాక్‌తో మ్యాచ్‌ని చూడబోమని కోహ్లీ స్పష్టీకరణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu IND vs PAK
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తాజాగా స్పందించాడు. టోర్నీకి ముందు లండన్‌లో ఏర్పాటు చేసిన కెప్టెన్ల సమావేశంలో టీమ్స్‌ గురించి మాట్లాడిన కోహ్లి.. పాక్‌తో మ్యాచ్‌ని అభిమానుల తరహాలో భావోద్వేగాలకి గురవకుండా ప్రొఫెషనల్‌గా ఆడతామని వెల్లడించాడు. వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారం జూన్ 16న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో మ్యాచ్‌ని భారత్ బహిష్కరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్స్ వినిపించాయి. అయితే.. ఇప్పటి వరకూ ప్రపంచకప్‌లో భారత్‌పై ఒక్కసారి కూడా గెలవని పాకిస్థాన్.. ఒకవేళ టీమిండియా ఆ మ్యాచ్‌ని బహిష్కరిస్తే.. విజయం సాధించినట్లవుతుందని మాజీ క్రికెటర్లు హెచ్చరించారు. అంతేకాకుండా.. పాక్‌ని ప్రపంచకప్‌లో ఓడించి అమర జవాన్లకి ఘనమైన నివాళి అర్పించాలని కూడా సూచించారు. దీంతో.. మ్యాచ్ బహిష్కరణ డిమాండ్ తగ్గింది.

పాక్‌తో మ్యాచ్‌పై కోహ్లి మాట్లాడుతూ ‘భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ భావోద్వేగాలతో కూడుకున్నది. కానీ.. అభిమానుల తరహాలో మేము ఆ మ్యాచ్‌ని చూడటం లేదు. మైదానం వెలుపల ఎలా ఉన్నా.. మ్యాచ్‌ కోసం గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత మేము ప్రొఫెషనల్‌గా ఆడతాం. పాక్‌తో అయినా.. టీమ్‌కి మాకు అదొక మ్యాచ్‌ మాత్రమే. ఒక జట్టుగా అన్ని మ్యాచ్‌ల తరహాలో.. పాక్‌తో మ్యాచ్‌లోనూ గెలిచేందుకు ప్రయత్నిస్తాం. మ్యాచ్‌కి ముందు భావోద్వేగ వాతావరణం కారణంగా ఒత్తిడి పెరగొచ్చు. కానీ.. మనం కేవలం మ్యాచ్‌లో మాత్రమే పోటీపడుతున్నామని గుర్తించుకోవాలి’ అని కోహ్లీ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.