ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్లో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ల్ని మలుపు తిప్పే ప్రదర్శన చేయగలడని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2019 సీజన్లో 16 మ్యాచ్లాడిన హార్దిక్ పాండ్య 190 స్ట్రైక్రేట్తో 402 పరుగులు చేశాడు. అలానే బంతితోనూ చెలరేగి 14 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా.. ఐపీఎల్ స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ చేసిన ఈ ఆల్రౌండర్ తన పవర్ హిట్టింగ్తో ముంబయి ఇండియన్స్ టీమ్కి భారీ స్కోర్లు అందించాడు. ఎంతలా అంటే.. అతని ఇన్నింగ్స్లో 38 ఫోర్లు, 29 సిక్సర్లు ఉండటం విశేషం. హార్దిక్ పాండ్యా గురించి తాజాగా సురేశ్ రైనా మాట్లాడుతూ.. ‘బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలోనైనా.. హార్దిక్ బ్యాటింగ్ చేయగలడు. అలానే.. కనీసం 6-7 ఓవర్లు బౌలింగ్ కూడా చేయగలడు. అయితే.. ప్రపంచకప్లో అతనికి టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పూర్తి సహకారం లభించాలి. అప్పుడే హార్దిక్ ఐపీఎల్ తరహాలో అత్యుత్తమంగా ఆడగలడు. ఒకవేళ వరల్డ్కప్లో హార్దిక్ పాండ్యాకి ‘‘మ్యాన్ ఆఫ్ టోర్నీమెంట్’’ అవార్డు లభించినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే.. అతను భారత్ తరఫున మ్యాచ్ల్ని మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న ఆటగాడు’ అని సురేశ్ రైనా వెల్లడించాడు.
హార్దిక్ మ్యాచ్ల్ని మలుపు తిప్పగలడు: రైనా
బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలోనైనా.. హార్దిక్ బ్యాటింగ్ చేయగలడు. అలానే.. కనీసం 6-7 ఓవర్లు బౌలింగ్ కూడా చేయగలడు. అయితే.. ప్రపంచకప్లో అతనికి టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పూర్తి సహకారం లభించాలి. -సురేశ్ రైనా
Samayam Telugu 28 May 2019, 5:38 pm
ప్రధానాంశాలు:
- ప్రపంచకప్లో హార్దిక్ పాండ్యా ప్రదర్శనే భారత్కి కీలకమన్న రైనా
- మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్గా నిలుస్తాడంటూ జోస్యం
- ఇటీవల ఐపీఎల్ 2019 సీజన్లో అదరగొట్టిన హార్దిక్ పాండ్య
- మ్యాచ్ల్ని హార్దిక్ మలుపు తిప్పగలడని రైనా ధీమా