యాప్నగరం

నిరాశపరిచిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్.. కివీస్‌ లక్ష్యం 242 పరుగులు

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 241 పరుగులకు పరిమితమైంది. మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు.

Samayam Telugu 19 Jun 2019, 8:36 pm
బర్మింగ్‌హమ్‌: వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ పిచ్‌పై పరుగులు రాబట్టడానికి సఫారీ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా శ్రమించారు. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా పది ఓవర్లలో 40 మాత్రమే చేసింది. హషీమ్
Samayam Telugu duplesis


హషీమ్ ఆమ్లా (83 బంతుల్లో 55 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించగా.. డుప్లెసిస్ (23), మర్కరమ్ (38), మిల్లర్ (36) ఫర్వాలేదనిపించారు. కుదురుకుంటున్న టైంలో డుప్లెసిస్.. ఫెర్గ్యుసన్ విసిరిన యార్కర్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. 64 బంతుల్లో 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన దుస్సెస్ మాత్రమే వేగంగా పరుగులు రాబట్టాడు. 2015 తర్వాత ఇంగ్లాండ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు.. పూర్తి కోటా బ్యాటింగ్ చేసినప్పటికీ.. సాధించిన నాలుగో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఫెర్గ్యుసన్ మూడు వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన సౌతాఫ్రికా మూడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడోస్థానంలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.