240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ గెలుపు ముగింట ఓడింది. టీమిండియా 221 పరుగులకు ఆలౌటయ్యింది. ఓ దశలో 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా... మిడిలార్డర్ ఆదుకోవడంతో కోలుకుంది. 24 పరుగులకే 4 వికెట్లు పడిన దశలో పాండ్య (32), పంత్ (32) భారత్ను ఆదుకున్నారు. కానీ శాంటర్న్ వీరిద్దర్నీ తెలివిగా బురిడీ కొట్టించాడు. దీంతో భారత్ 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ ఓటమి లాంఛనమే అనుకుంటున్న దశలో ధోనీ, జడేజా అద్భుతమైన శతక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. ధోనీ, జడేజా ఆరంభంలో ఆచితూచి ఆడుతూ.. స్కోరు బోర్డును 100, 200 పరుగుల మార్క్ దాటించారు. ధోనీ నెమ్మదిగా ఆడగా.. బ్యాట్ ఝలిపించిన జడేజా 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ స్కోరు 208 పరుగుల వద్ద జడేజా (77) భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు.
చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 31 పరుగులు అవసరం కాగా.. ఫెర్గ్యుసన్ విసిరిన తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టాడు. దీంతో భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో రెండో పరుగుకు యత్నించిన ధోనీ (50).. గుప్టిల్ డైరెక్ట్ త్రో విసరడంతో రనౌటయ్యాడు. దీంతో భారత్ ఆశలు అడియాసలయ్యాయి. టెయింలెండర్లు వెనువెంటనే వెనుదిరగడంతో.. భారత్ 221 పరుగులకు ఆలౌటయ్యంది.
వికెట్లు పడ్డాయిలా..
హెన్రీ విసిరిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రోహిత్ (1) కీపర్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ విసిరిన మరుసటి ఓవర్లోనే కోహ్లి ఎల్బీగా అవుటయ్యాడు. విరాట్ డీఆర్ఎస్ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. రోహిత్, కోహ్లి సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరడం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మరుసటి ఓవర్లోనే రాహుల్ కూడా కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ ఐదు పరుగులకే 3 కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపికగా 20 బంతులు ఆడిన దినేశ్ కార్తీక్ (6).. 21వ బంతికి ఫోర్ కొట్టి ఖాతా తెరిచాడు. అనంతరం హెన్రీ బౌలింగ్లో నీషామ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో కార్తీక్ ఔటయ్యాడు. ఫెర్గ్యుసన్ వేసిన 12.1 ఓవర్లో పంత్ ఇచ్చిన క్యాచ్ను పట్టడంలో నీషామ్ విఫలమయ్యాడు. దీంతో 19 పరుగుల వద్ద పంత్కు లైఫ్ వచ్చింది.
16.5 ఓవర్లలో 50 పరుగుల మార్క్ను చేరుకున్న భారత్.. 22.5 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. శాంట్నర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన పంత్ (32) గ్రాండ్హోమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. పంత్ స్థానంలో ధోనీ క్రిజులోకి వచ్చాడు. ధోనీకి ఇది 350వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం.
భారత్ సాధించాల్సిన రన్ రేట్ 7 దాటడంతో శాంటర్న్ బౌలింగ్లో హిట్టింగ్ కోసం ప్రయత్నించిన పాండ్య (62 బంతుల్లో 32) కేన్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హార్దిక్ ఔటయ్యే సమయానికి భారత్ 30.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.
కివీస్ 239/8:
భారత్తో జరుగుతోన్న వరల్డ్ కప్ సెమీఫైనల్లో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసిన దశలో మంగళవారం వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. భారత పేసర్లు బుమ్రా, భువీ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. దీంతో కివీస్ జట్టు 239/కే పరిమితమైంది.
మంగళవారం నాటి స్కోరుకు 10 పరుగులు జోడించిన అనంతరం కివీస్.. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 90 బంతుల్లో 74 పరుగులు చేసిన టేలర్ జడేజా డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ చేయగా.. తర్వాత భువి బౌలింగ్లో టామ్ లాథమ్.. జడ్డూకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భువి వేసిన 49వ ఓవర్లో హెన్రీ (1) కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Read More:undefined
Read More: ధోనీ నో చెప్తున్నా రివ్యూకి వెళ్లి భంగపడిన కోహ్లి
మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కివీస్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (1: 14 బంతుల్లో), హెన్రీ నికోలస్ (28: 51 బంతుల్లో 2x4) జోడీకి తొలి ఓవర్ నుంచే భారత్ బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశమివ్వలేదు. దీంతో.. మూడో ఓవర్లోగానీ.. ఆ జట్టు పరుగుల ఖాతా తెరవలేకపోయింది. స్కోరు బోర్డుపైకి ఒక్క పరుగు చేరగానే.. మార్టిన్ గప్తిల్ని ఔట్ చేసిన బుమ్రా 1/1తో కివీస్కి షాకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్ (67: 95 బంతుల్లో 6x4) నిలకడగా ఆడినా.. వేగం పెంచలేకపోయాడు. మరోవైపు కాసేపు అతనికి సహకారం అందించిన మరో ఓపెనర్ నికోలస్ని జడేజా బోల్తా కొట్టించాడు. ఈ దశలో విలియమ్సన్తో కలిసి రాస్టేలర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. ఈ జోడీ మరీ రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో.. కివీస్ స్కోరుబోర్డు నత్తనడకన సాగింది.
Read More: undefined
అర్ధశతకం తర్వాత దూకుడు పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేన్ విలియమ్సన్ని చాహల్ బుట్టలో వేయగా.. ఆ తర్వాత వచ్చిన జేమ్స్ నీషమ్ (12: 18 బంతుల్లో 1x4), గ్రాండ్ హోమ్ (16: 10 బంతుల్లో 2x4) స్లాగ్ ఓవర్లలో భారీ షాట్లు ఆడబోయి పెవిలియన్ చేరారు. కానీ.. నెమ్మదిగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న టేలర్.. కివీస్ స్కోరు బోర్డుని నడిపిస్తుండగా వర్షం మొదలైంది.
భారత తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక మార్పు చేశాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని పక్కకి తప్పించి అతని స్థానంలో మరో స్పిన్నర్ చాహల్ని తీసుకున్నాడు.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, చాహల్
టోర్నీ లీగ్ దశలో 9 మ్యాచ్లాడిన భారత్ జట్టు ఏడింట్లో గెలుపొంది.. ఒక మ్యాచ్లో మాత్రమే ఓడింది. మరొక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో.. లీగ్ దశ ముగిసే సరికి 15 పాయింట్లతో భారత్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది.
మరోవైపు 9 మ్యాచ్లాడిన న్యూజిలాండ్ జట్టు ఐదింట్లో గెలుపొంది.. మూడింట్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. దీంతో.. 11 పాయింట్లతో నాలుగో స్థానంతో కివీస్ సరిపెట్టుకుంది. ప్రపంచకప్కి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ జట్టు ఓడిపోగా. .ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
India (Playing XI): Lokesh Rahul, Rohit Sharma, Virat Kohli(c), Rishabh Pant, MS Dhoni(w), Dinesh Karthik, Hardik Pandya, Ravindra Jadeja, Bhuvneshwar Kumar, Yuzvendra Chahal, Jasprit Bumrah
New Zealand (Playing XI): Martin Guptill, Henry Nicholls, Kane Williamson(c), Ross Taylor, Tom Latham(w), James Neesham, Colin de Grandhomme, Mitchell Santner, Lockie Ferguson, Matt Henry, Trent Boult
చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 31 పరుగులు అవసరం కాగా.. ఫెర్గ్యుసన్ విసిరిన తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టాడు. దీంతో భారత్ విజయానికి 10 బంతుల్లో 25 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో రెండో పరుగుకు యత్నించిన ధోనీ (50).. గుప్టిల్ డైరెక్ట్ త్రో విసరడంతో రనౌటయ్యాడు. దీంతో భారత్ ఆశలు అడియాసలయ్యాయి. టెయింలెండర్లు వెనువెంటనే వెనుదిరగడంతో.. భారత్ 221 పరుగులకు ఆలౌటయ్యంది.
వికెట్లు పడ్డాయిలా..
హెన్రీ విసిరిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రోహిత్ (1) కీపర్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ విసిరిన మరుసటి ఓవర్లోనే కోహ్లి ఎల్బీగా అవుటయ్యాడు. విరాట్ డీఆర్ఎస్ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. రోహిత్, కోహ్లి సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరడం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మరుసటి ఓవర్లోనే రాహుల్ కూడా కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ ఐదు పరుగులకే 3 కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపికగా 20 బంతులు ఆడిన దినేశ్ కార్తీక్ (6).. 21వ బంతికి ఫోర్ కొట్టి ఖాతా తెరిచాడు. అనంతరం హెన్రీ బౌలింగ్లో నీషామ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో కార్తీక్ ఔటయ్యాడు. ఫెర్గ్యుసన్ వేసిన 12.1 ఓవర్లో పంత్ ఇచ్చిన క్యాచ్ను పట్టడంలో నీషామ్ విఫలమయ్యాడు. దీంతో 19 పరుగుల వద్ద పంత్కు లైఫ్ వచ్చింది.
16.5 ఓవర్లలో 50 పరుగుల మార్క్ను చేరుకున్న భారత్.. 22.5 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. శాంట్నర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన పంత్ (32) గ్రాండ్హోమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. పంత్ స్థానంలో ధోనీ క్రిజులోకి వచ్చాడు. ధోనీకి ఇది 350వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం.
భారత్ సాధించాల్సిన రన్ రేట్ 7 దాటడంతో శాంటర్న్ బౌలింగ్లో హిట్టింగ్ కోసం ప్రయత్నించిన పాండ్య (62 బంతుల్లో 32) కేన్ విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. హార్దిక్ ఔటయ్యే సమయానికి భారత్ 30.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.
కివీస్ 239/8:
భారత్తో జరుగుతోన్న వరల్డ్ కప్ సెమీఫైనల్లో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసిన దశలో మంగళవారం వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం మ్యాచ్ తిరిగి ప్రారంభం కాగా.. భారత పేసర్లు బుమ్రా, భువీ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. దీంతో కివీస్ జట్టు 239/కే పరిమితమైంది.
మంగళవారం నాటి స్కోరుకు 10 పరుగులు జోడించిన అనంతరం కివీస్.. వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 90 బంతుల్లో 74 పరుగులు చేసిన టేలర్ జడేజా డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ చేయగా.. తర్వాత భువి బౌలింగ్లో టామ్ లాథమ్.. జడ్డూకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భువి వేసిన 49వ ఓవర్లో హెన్రీ (1) కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
Read More:undefined
Read More: ధోనీ నో చెప్తున్నా రివ్యూకి వెళ్లి భంగపడిన కోహ్లి
మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కివీస్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (1: 14 బంతుల్లో), హెన్రీ నికోలస్ (28: 51 బంతుల్లో 2x4) జోడీకి తొలి ఓవర్ నుంచే భారత్ బౌలర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశమివ్వలేదు. దీంతో.. మూడో ఓవర్లోగానీ.. ఆ జట్టు పరుగుల ఖాతా తెరవలేకపోయింది. స్కోరు బోర్డుపైకి ఒక్క పరుగు చేరగానే.. మార్టిన్ గప్తిల్ని ఔట్ చేసిన బుమ్రా 1/1తో కివీస్కి షాకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కేన్ విలియమ్సన్ (67: 95 బంతుల్లో 6x4) నిలకడగా ఆడినా.. వేగం పెంచలేకపోయాడు. మరోవైపు కాసేపు అతనికి సహకారం అందించిన మరో ఓపెనర్ నికోలస్ని జడేజా బోల్తా కొట్టించాడు. ఈ దశలో విలియమ్సన్తో కలిసి రాస్టేలర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. ఈ జోడీ మరీ రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో.. కివీస్ స్కోరుబోర్డు నత్తనడకన సాగింది.
Read More: undefined
అర్ధశతకం తర్వాత దూకుడు పెంచేందుకు ప్రయత్నిస్తున్న కేన్ విలియమ్సన్ని చాహల్ బుట్టలో వేయగా.. ఆ తర్వాత వచ్చిన జేమ్స్ నీషమ్ (12: 18 బంతుల్లో 1x4), గ్రాండ్ హోమ్ (16: 10 బంతుల్లో 2x4) స్లాగ్ ఓవర్లలో భారీ షాట్లు ఆడబోయి పెవిలియన్ చేరారు. కానీ.. నెమ్మదిగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న టేలర్.. కివీస్ స్కోరు బోర్డుని నడిపిస్తుండగా వర్షం మొదలైంది.
భారత తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక మార్పు చేశాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని పక్కకి తప్పించి అతని స్థానంలో మరో స్పిన్నర్ చాహల్ని తీసుకున్నాడు.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి (కెప్టెన్), రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, చాహల్
టోర్నీ లీగ్ దశలో 9 మ్యాచ్లాడిన భారత్ జట్టు ఏడింట్లో గెలుపొంది.. ఒక మ్యాచ్లో మాత్రమే ఓడింది. మరొక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో.. లీగ్ దశ ముగిసే సరికి 15 పాయింట్లతో భారత్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది.
మరోవైపు 9 మ్యాచ్లాడిన న్యూజిలాండ్ జట్టు ఐదింట్లో గెలుపొంది.. మూడింట్లో ఓడింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. దీంతో.. 11 పాయింట్లతో నాలుగో స్థానంతో కివీస్ సరిపెట్టుకుంది. ప్రపంచకప్కి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ జట్టు ఓడిపోగా. .ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
India (Playing XI): Lokesh Rahul, Rohit Sharma, Virat Kohli(c), Rishabh Pant, MS Dhoni(w), Dinesh Karthik, Hardik Pandya, Ravindra Jadeja, Bhuvneshwar Kumar, Yuzvendra Chahal, Jasprit Bumrah
New Zealand (Playing XI): Martin Guptill, Henry Nicholls, Kane Williamson(c), Ross Taylor, Tom Latham(w), James Neesham, Colin de Grandhomme, Mitchell Santner, Lockie Ferguson, Matt Henry, Trent Boult