భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడ్ని దురదృష్టం వెంటాడుతోంది. ప్రపంచకప్ జట్టు ఎంపిక సమయంలో రాయుడ్ని పక్కన పెట్టిన సెలక్టర్లు నెం.4 స్థానం కోసం విజయ్ శంకర్ని ఎంపిక చేశారు. దీంతో.. పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో.. వారం వ్యవధిలోనే రాయుడితో పాటు రిషబ్ పంత్, నవదీప్ షైనీని స్టాండ్బైగా సెలెక్ట్ చేశారు. undefined
టీమ్లో ఎవరైనా గాయపడితే.. ఈ ముగ్గురితో భర్తీ చేస్తామని అప్పట్లో బీసీసీఐ చెప్పుకొచ్చింది. దీంతో.. ఫస్ట్ ఛాన్స్ సీనియర్ రాయుడికే వస్తుందని అంతా ఊహించారు. కానీ.. టోర్నీలో శిఖర్ ధావన్ గాయపడగానే అతని స్థానంలో రిషబ్ పంత్కి మొదటి అవకాశం దక్కింది. తాజాగా విజయ్ శంకర్ గాయపడగా.. అనూహ్యంగా మయాంక్ అగర్వాల్ని అతని స్థానంలో సెలక్టర్లు ఎంపిక చేశారు.
undefined
వాస్తవానికి స్టాండ్బైగా ఉన్న అంబటి రాయుడికి ఆ అవకాశం దక్కాలి. ఈ మేరకు సెలక్టర్ల మధ్య రాయుడితో పాటు అజింక్య రహానె గురించి కూడా చర్చ నడిచిందట. కానీ.. తర్జనభర్జనల తర్వాత మయాంక్ అగర్వాల్ని సెలక్టర్లు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఇంగ్లాండ్ గడ్డపై గత ఏడాది భారత్ -ఎ జట్టు తరఫున ఆడిన మయాంక్ అగర్వాల్.. నాలుగు మ్యాచ్ల్లో 71.75 సగటుతో 287 పరుగులు చేశాడు. ఆ సిరీస్లో మయాంక్ స్ట్రైక్రేట్ 105.90గా ఉండటంతో.. సెలక్టర్లు అతనివైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రహానె స్పిన్ బలహీనత, రాయుడి ఇటీవల పేలవ ఫామ్ గురించి కూడా సమావేశంలో చర్చకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ప్రొఫెషనల్ ఓపెనర్ అయిన మయాంక్ని తుది జట్టులో ఆడిస్తే..? అప్పుడు కేఎల్ రాహుల్ని నెం.4లోకి మార్చుకునే వెసులబాటు ఉన్నందున సెలక్టర్లు అతనివైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
టీమ్లో ఎవరైనా గాయపడితే.. ఈ ముగ్గురితో భర్తీ చేస్తామని అప్పట్లో బీసీసీఐ చెప్పుకొచ్చింది. దీంతో.. ఫస్ట్ ఛాన్స్ సీనియర్ రాయుడికే వస్తుందని అంతా ఊహించారు. కానీ.. టోర్నీలో శిఖర్ ధావన్ గాయపడగానే అతని స్థానంలో రిషబ్ పంత్కి మొదటి అవకాశం దక్కింది. తాజాగా విజయ్ శంకర్ గాయపడగా.. అనూహ్యంగా మయాంక్ అగర్వాల్ని అతని స్థానంలో సెలక్టర్లు ఎంపిక చేశారు.
undefined
వాస్తవానికి స్టాండ్బైగా ఉన్న అంబటి రాయుడికి ఆ అవకాశం దక్కాలి. ఈ మేరకు సెలక్టర్ల మధ్య రాయుడితో పాటు అజింక్య రహానె గురించి కూడా చర్చ నడిచిందట. కానీ.. తర్జనభర్జనల తర్వాత మయాంక్ అగర్వాల్ని సెలక్టర్లు ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఇంగ్లాండ్ గడ్డపై గత ఏడాది భారత్ -ఎ జట్టు తరఫున ఆడిన మయాంక్ అగర్వాల్.. నాలుగు మ్యాచ్ల్లో 71.75 సగటుతో 287 పరుగులు చేశాడు. ఆ సిరీస్లో మయాంక్ స్ట్రైక్రేట్ 105.90గా ఉండటంతో.. సెలక్టర్లు అతనివైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రహానె స్పిన్ బలహీనత, రాయుడి ఇటీవల పేలవ ఫామ్ గురించి కూడా సమావేశంలో చర్చకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ప్రొఫెషనల్ ఓపెనర్ అయిన మయాంక్ని తుది జట్టులో ఆడిస్తే..? అప్పుడు కేఎల్ రాహుల్ని నెం.4లోకి మార్చుకునే వెసులబాటు ఉన్నందున సెలక్టర్లు అతనివైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.