యాప్నగరం

Ajinkya Rahane: వెస్టిండీస్‌పై భారత్‌ని ఆదుకున్న రహానె

సుదీర్ఘకాలం తర్వాత భారత్ జట్టు తరఫున ఆడిన అజింక్య రహానె.. తొలి మ్యాచ్‌లోనే బాధ్యతాయుత అర్ధశతకంతో టీమ్ పరువు నిలిపాడు. కోహ్లీ, పుజారా పేలవంగా విఫలమైన చోట.. సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

Samayam Telugu 23 Aug 2019, 9:49 am

ప్రధానాంశాలు:

  • తొలి టెస్టులో మొదటి రోజే అడ్డుపడిన వరుణుడు
  • హాఫ్ సెంచరీతో భారత్‌ని ఆదుకున్న అజింక్య రహానె
  • తేలిపోయిన విరాట్ కోహ్లీ, పుజారా, మయాంక్ అగర్వాల్
  • తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 203/6
  • క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu North Sound: Indias Ajinkya Rahane plays a shot against West Indies during day ...
India's Ajinkya Rahane plays a shot against West Indies during day one of the first Test cricket match at the Sir Vivian Richards cricket ground in North Sound, Antigua and Barbuda. AP/PTI(
వెస్టిండీస్‌తో ఆంటిగ్వా వేదికగా గురువారం రాత్రి ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు పడిలేచింది. వర్షం పదే పదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానె (81: 163 బంతుల్లో 10x4) హాఫ్ సెంచరీ సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 203/6తో నిలిచింది. క్రీజులో రిషబ్ పంత్ (20 నాటౌట్: 41 బంతుల్లో 4x4), రవీంద్ర జడేజా (3 నాటౌట్: 28 బంతుల్లో) ఉన్నారు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు కీమర్ రోచ్ మూడు, గాబ్రిల్ రెండు వికెట్లు పడగొట్టారు.
Read More: విండీస్ గడ్డపై అరుదైన రికార్డ్‌ ముంగిట జడేజా
మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్.. భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. దీంతో.. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ జట్టుకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5: 13 బంతుల్లో 1x4), టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (2: 4 బంతుల్లో)‌లను ఒకే ఓవర్‌లో కీమర్ రోచ్ పెవిలియన్ బాట పట్టించగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (9: 12 బంతుల్లో 2x4) గాబ్రిల్ బౌలింగ్‌లో దొరికిపోయాడు. దీంతో.. భారత్ జట్టు 7.5 ఓవర్లు ముగిసే సమయానికి 25/3తో ఒత్తిడిలో పడింది.

Read More: వెస్టిండీస్‌ జట్టుతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
ఈ దశలో క్రీజులోకి వచ్చిన అజింక్య రహానె.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (44: 97 బంతుల్లో 5x4)తో కలిసి భారత్ జట్టుని ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కి ఈ జోడీ 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. జట్టు స్కోరు 93 వద్ద రాహుల్ ఔటైపోయాడు. అనంతరం వచ్చిన హనుమ విహారి (35: 56 బంతుల్లో 5x4) దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ చేజార్చుకున్నాడు. అయినప్పటకీ.. పట్టుదలతో ఆడిన రహానె హాఫ్ సెంచరీతో భారత్ పరువు నిలిపాడు. వర్షం కారణంగా 68.5 ఓవర్ల వద్దే తొలి రోజు ఆట ముగిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.