యాప్నగరం

IPL Auction: మళ్లీ పంజాబ్ గూటికి మ్యాక్స్‌వెల్.. భారీ ధరకు కొనుగోలు

ఆసీస్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఈసారి వేలంలో అత్యధిక ధర పలికింది. రూ.10.75 కోట్లకు పంజాబ్ తనను కొనుగోలు చేసింది.

Samayam Telugu 19 Dec 2019, 4:17 pm
ఈసారి వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యా్క్స్‌వెల్ పంట పండింది. గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో తనను రూ.10.75 కోట్లు చెల్లించి కింగ్స్ లెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది.
Samayam Telugu MAXWELL


ఆల్‌రౌండ్ నైపుణ్యాలు, అద్భుతమైన ఫీల్డింగ్‌తో అలరించే మ్యాక్సీని కొనుగోలు చేసేందుకు అన్ని జట్లు పోటీపడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ మధ్య పోరు హోరీహోరీగా సాగింది.

దీంతో మ్యాక్సీ ధర రూ.10 కోట్ల మార్కును దాటింది. చివరికు రూ.10.75 కోట్లు చెల్లించి కింగ్స్ లెవన్ పంజాబ్ తనను దక్కించుకుంది. గతంలో కూడా పంజాబ్ తరపున మ్యాక్సీ ఆడాడు. మరోవైపు ఈ సీజన్‌లో తను ఆడలేదు. వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసం తను విరామం తీసుకున్నాడు.

వేలంలోకి 42.70 కోట్లతో వేలంలోకి వచ్చిన పంజాబ్.. అందులో నాలుగో వంతు ధరను ఓ ప్లేయర్ కోసం వెచ్చించడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.