ఈసారి వేలంలో ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యా్క్స్వెల్ పంట పండింది. గురువారం కోల్కతాలో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో తనను రూ.10.75 కోట్లు చెల్లించి కింగ్స్ లెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది.
ఆల్రౌండ్ నైపుణ్యాలు, అద్భుతమైన ఫీల్డింగ్తో అలరించే మ్యాక్సీని కొనుగోలు చేసేందుకు అన్ని జట్లు పోటీపడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ మధ్య పోరు హోరీహోరీగా సాగింది.
దీంతో మ్యాక్సీ ధర రూ.10 కోట్ల మార్కును దాటింది. చివరికు రూ.10.75 కోట్లు చెల్లించి కింగ్స్ లెవన్ పంజాబ్ తనను దక్కించుకుంది. గతంలో కూడా పంజాబ్ తరపున మ్యాక్సీ ఆడాడు. మరోవైపు ఈ సీజన్లో తను ఆడలేదు. వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసం తను విరామం తీసుకున్నాడు.
వేలంలోకి 42.70 కోట్లతో వేలంలోకి వచ్చిన పంజాబ్.. అందులో నాలుగో వంతు ధరను ఓ ప్లేయర్ కోసం వెచ్చించడం విశేషం.
ఆల్రౌండ్ నైపుణ్యాలు, అద్భుతమైన ఫీల్డింగ్తో అలరించే మ్యాక్సీని కొనుగోలు చేసేందుకు అన్ని జట్లు పోటీపడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ మధ్య పోరు హోరీహోరీగా సాగింది.
దీంతో మ్యాక్సీ ధర రూ.10 కోట్ల మార్కును దాటింది. చివరికు రూ.10.75 కోట్లు చెల్లించి కింగ్స్ లెవన్ పంజాబ్ తనను దక్కించుకుంది. గతంలో కూడా పంజాబ్ తరపున మ్యాక్సీ ఆడాడు. మరోవైపు ఈ సీజన్లో తను ఆడలేదు. వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసం తను విరామం తీసుకున్నాడు.
వేలంలోకి 42.70 కోట్లతో వేలంలోకి వచ్చిన పంజాబ్.. అందులో నాలుగో వంతు ధరను ఓ ప్లేయర్ కోసం వెచ్చించడం విశేషం.