IPLలోకి కొత్తగా అహ్మదాబద్, లక్నో జట్లు.. ఇక 10 జట్లతో ఐపీఎల్ 2022
ఐపీఎల్లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇచ్చాయి. దాంతో.. వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ పది జట్లతో జరగనుండగా.. కొత్తగా వచ్చిన జట్లు లక్నో, అహ్మదాబాద్...
Samayam Telugu 26 Oct 2021, 6:55 am
ప్రధానాంశాలు:
- ఐపీఎల్లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ
- అహ్మదాబాద్ జట్టుని కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్స్
- లక్నో జట్టుని దక్కించుకున్న ఆర్పీఎస్జీ గ్రూప్
- 10 జట్లతో ఐపీఎల్ 2022 సీజన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి కొత్తగా రెండు జట్లు ప్రవేశించాయి. గత కొన్ని సీజన్లుగా 8 జట్లతో ఐపీఎల్ జరుగుతుండగా.. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అహ్మదాబాద్, లక్నో జట్లు కూడా పోటీపడనున్నాయి. అహ్మదాబాద్ జట్టుని రూ.5625 కోట్లకి సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ దక్కించుకోగా.. లక్నో జట్టుని రూ.7090 కోట్లకి ఆర్పీఎస్జీ గ్రూప్ చేజిక్కించుకుంది. దాంతో.. ఇకపై 10 జట్లతో ఐపీఎల్ జరగనుంది. ఇప్పటి వరకూ టోర్నీలో 60 మ్యాచ్లు జరుగుతుండగా.. ఆ సంఖ్య ఇక 74కి చేరనుంది. వాస్తవానికి బీసీసీఐ బిడ్లను ఆహ్వానించిన తర్వాత ఏకంగా 22 కంపెనీలు రూ.10 లక్షలు విలువ చేసే టెండర్ పేపర్స్ని కొనుగోలు చేశాయి. కానీ.. బీసీసీఐ ఒక్కో ఫ్రాంఛైజీ కనీస ధర రూ. 2000 కోట్లుగా నిర్ణయించడంతో తీరా బిడ్లు వేసే సమయానికి కొన్ని వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. బిడ్ దాఖలు చేసిన కంపెనీల్లో అదాని గ్రూపు, కొటక్ టోరెంట్ ఫార్మా పేర్లు కూడా వినిపించాయి. అలానే బాలీవుడ్ జంట రణవీర్-దీపికా కూడా ఫ్రాంఛైజీ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న జట్లు
1. చెన్నై సూపర్ కింగ్స్
2. ముంబయి ఇండియన్స్
3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
4. ఢిల్లీ క్యాపిటల్స్
5. రాజస్థాన్ రాయల్స్
6. సన్రైజర్స్ హైదరాబాద్
7. పంజాబ్ కింగ్స్
8. కోల్కతా నైట్రైడర్స్
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. గతంలో టోర్నీలో ఆడి కనుమరుగైన జట్లు కొన్ని ఉన్నాయి. వాటిలో దక్కన్ ఛార్జర్ 2008 నుంచి 2012 వరకూ ఐపీఎల్లో ఆడగా.. కొచ్చి టస్కర్స్ 2011లో ఆడింది. ఆ తర్వాత పుణె వారియర్స్ 2011 నుంచి 2013 వరకూ ఐపీఎల్లో ఆడింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్పై 2016, 2017లో నిషేధం పడగా.. వాటి స్థానాల్లో ఆ రెండు సీజన్లలో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్లు ఆడాయి. కానీ.. 2018లో చెన్నై, రాజస్థాన్ రీఎంట్రీ ఇవ్వగానే.. ఆ జట్లు రద్దయ్యాయి.
ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న జట్లు
1. చెన్నై సూపర్ కింగ్స్
2. ముంబయి ఇండియన్స్
3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
4. ఢిల్లీ క్యాపిటల్స్
5. రాజస్థాన్ రాయల్స్
6. సన్రైజర్స్ హైదరాబాద్
7. పంజాబ్ కింగ్స్
8. కోల్కతా నైట్రైడర్స్
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. గతంలో టోర్నీలో ఆడి కనుమరుగైన జట్లు కొన్ని ఉన్నాయి. వాటిలో దక్కన్ ఛార్జర్ 2008 నుంచి 2012 వరకూ ఐపీఎల్లో ఆడగా.. కొచ్చి టస్కర్స్ 2011లో ఆడింది. ఆ తర్వాత పుణె వారియర్స్ 2011 నుంచి 2013 వరకూ ఐపీఎల్లో ఆడింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్పై 2016, 2017లో నిషేధం పడగా.. వాటి స్థానాల్లో ఆ రెండు సీజన్లలో గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్లు ఆడాయి. కానీ.. 2018లో చెన్నై, రాజస్థాన్ రీఎంట్రీ ఇవ్వగానే.. ఆ జట్లు రద్దయ్యాయి.