యాప్నగరం

కోహ్లి, రోహిత్‌లను దాటేసిన రహానే!

ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానే కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. కానీ ఢిల్లీపై రికార్డును మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు.

Samayam Telugu 11 Apr 2018, 9:23 pm
ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ అజింక్య రహానే కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. 40 బంతుల్లో 45 పరుగులు చేసిన రహానే నదీమ్ బౌలింగ్‌లో క్రిస్ మోరిస్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. షాట్ ఎంపికలో రహానే తడబడగా.. బ్యాట్ ఎడ్జ్‌ను తాకుతూ బంతి పాయింట్‌లో ఉన్న మోరిస్ చేతిలో పడింది. దీంతో 13.4 ఓవర్లలో రాజస్థాన్ 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
Samayam Telugu rahane


రహానే కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్సయినప్పటికీ.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకూ 670 పరుగులు చేసిన రోహిత్ శర్మ పేరిట ఈ రికార్డ్ ఉండగా.. దాన్ని రహానే అధిగమించాడు. రహానే ఢిల్లీపై 677 రన్స్ చేశాడు. మూడో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లి ఢిల్లీపై 661 పరుగులు చేశాడు. రహానే విషయానికి వస్తే .. ఐపీఎల్‌లో మిగతా ఏ జట్లపై కూడా 500కిపైగా పరుగులు చేయకపోవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.