రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ ఐపీఎల్ 2020లో ఇరగదీస్తున్నాడు. ఈ సీజన్లోనే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పడిక్కల్.. ఇప్పటి వరకూ ఆడిన 4 మ్యాచ్ల్లో మూడింట్లో అర్ధశతకాలు బాదాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన పడిక్కల్.. ఆరెంజ్ ఆర్మీపై 56 రన్స్ చేశాడు. తర్వాతి మ్యాచ్ల్లో 1, 54, 63 చొప్పున రన్స్ చేశాడు.
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 34 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన పడిక్కల్.. కోహ్లితో కలిసి బెంగళూరును గెలిపించాడు. జట్టు స్కోరు 25 పరుగుల వద్దే ఫించ్ ఔటైనా... పరుగులు చేయడానికి కోహ్లి ఇబ్బంది పడినా.. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు.
దేవ్దత్ పడిక్కల్ 2000 సంవత్సరం జులై 7న కేరళలోని ఎడప్పల్లో అంబలి పడిక్కల్, బాబును కున్నత్ దంపతులకు జన్మించాడు.
పడిక్కల్ క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. కానీ పడిక్కల్ కడుపులో పడగానే.. మగ బిడ్డ పుడితే.. క్రికెటర్ చేయాలని అంబిలి భావించారట.
పడిక్కల్ తండ్రి బాబును కున్నత్ హైదరాబాద్లో పనిచేసేవారు. కేఆర్ పురంలో వారికి సొంత ఇల్లు ఉంది. అంబటి రాయుడి సమీప బంధువు దగ్గర పడిక్కల్ క్రికెట్లో ఓనమాలు దిద్దాడు. కానీ ఆయన దగ్గర ఎక్కువ మంది శిక్షణ పొందుతుండటంతో.. కున్నత్ ఆలోచనలో పడ్డారు. పడిక్కల్ క్రికెట్ కెరీర్ కోసం.. 2011లో అతడి తల్లిదండ్రులు బెంగళూరుకు షిప్ట్ అయ్యారు. బెంగళూరు సమీపంలోని బైపనహల్లిలో పడిక్కల్ ఫ్యామిలీ స్థిరపడింది.
పడిక్కల్ 17 ఏళ్ల వయసులోనే.. కర్ణాటక ప్రీమియర్ లీగ్లో ఆడాడు. బళ్లారి తరఫున ఆడిన దేవ్దత్... బెంగళూరు బ్లాస్టర్స్పై 53 బంతుల్లోనే 72 రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
అండర్-14, అండర్-16 మ్యాచ్ల్లో పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. కానీ అండర్-19 క్రికెట్లో ఫామ్ కోల్పోయాడు. ఏడాదిపాటు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో ఒక్క మ్యాచ్లో భారీ స్కోర్ చేస్తే చాలు.. నీ జీవితం మారిపోతుందని పడిక్కల్కు అతడి కోచ్ మహ్మద్ నసీరుద్దీన్ సూచించారు. ఓ క్లబ్ మ్యాచ్లో సెంచరీ బాదిన పడిక్కల్ మళ్లీ తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
2018లో కుచ్ బెహార్ ట్రోఫీలో పడిక్కల్ 829 రన్స్ చేశాడు. దీంతో అతడికి కర్ణాటక రంజీ జట్టులో చోటు దక్కింది. మైసూర్ వేదికగా మహారాష్ట్రతో తొలి రంజీ మ్యాచ్ ఆడిన పడిక్కల్.. ఆ మ్యాచ్లో 77 రన్స్ చేశాడు.
2019లో కర్ణాటక ప్రీమియర్ లీగ్లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు సాధించిన పడిక్కల్ను ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. విజయ్ హజారే టోర్నీ, సయ్యద్ ముస్తక్ అలీ టీ20 టోర్నీలో అదరగొట్టిన పడిక్కల్.. 2020 ఐపీఎల్లో బెంగళూరు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. పడిక్కల్ను ఓపెనర్గా ఆడించడం కోసం.. డివిలియర్స్ కీపింగ్ చేయాల్సి వచ్చిందంటే.. ఈ యంగ్ ప్లేయర్పై కోహ్లికి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.
పదో తరగతిలో.. కేవలం రెండు నెలలు మాత్రమే చదివిన దేవ్దత్ 96 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. కోవిడ్ కారణంగా లాక్డౌన్ విధించడంతో.. ప్రత్యేక అనుమతితో దేవ్దత్ బీబీఏ నాలుగో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశాడు.
2018 డిసెంబర్ 18న ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ పడిక్కల్ను కొనుగోలు చేసింది. అయినప్పటికీ పడిక్కల్ చాలా కామ్గా.. ఇదేం పట్టనట్టుగా ఉన్నాడు. కానీ పడిక్కల్ తండ్రి బబున్ మాత్రం ఆనందంతో ఎగిరి గంతేశాడు.
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో 34 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన పడిక్కల్.. కోహ్లితో కలిసి బెంగళూరును గెలిపించాడు. జట్టు స్కోరు 25 పరుగుల వద్దే ఫించ్ ఔటైనా... పరుగులు చేయడానికి కోహ్లి ఇబ్బంది పడినా.. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు.
దేవ్దత్ పడిక్కల్ 2000 సంవత్సరం జులై 7న కేరళలోని ఎడప్పల్లో అంబలి పడిక్కల్, బాబును కున్నత్ దంపతులకు జన్మించాడు.
పడిక్కల్ క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. కానీ పడిక్కల్ కడుపులో పడగానే.. మగ బిడ్డ పుడితే.. క్రికెటర్ చేయాలని అంబిలి భావించారట.
పడిక్కల్ తండ్రి బాబును కున్నత్ హైదరాబాద్లో పనిచేసేవారు. కేఆర్ పురంలో వారికి సొంత ఇల్లు ఉంది. అంబటి రాయుడి సమీప బంధువు దగ్గర పడిక్కల్ క్రికెట్లో ఓనమాలు దిద్దాడు. కానీ ఆయన దగ్గర ఎక్కువ మంది శిక్షణ పొందుతుండటంతో.. కున్నత్ ఆలోచనలో పడ్డారు. పడిక్కల్ క్రికెట్ కెరీర్ కోసం.. 2011లో అతడి తల్లిదండ్రులు బెంగళూరుకు షిప్ట్ అయ్యారు. బెంగళూరు సమీపంలోని బైపనహల్లిలో పడిక్కల్ ఫ్యామిలీ స్థిరపడింది.
పడిక్కల్ 17 ఏళ్ల వయసులోనే.. కర్ణాటక ప్రీమియర్ లీగ్లో ఆడాడు. బళ్లారి తరఫున ఆడిన దేవ్దత్... బెంగళూరు బ్లాస్టర్స్పై 53 బంతుల్లోనే 72 రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
2018లో కుచ్ బెహార్ ట్రోఫీలో పడిక్కల్ 829 రన్స్ చేశాడు. దీంతో అతడికి కర్ణాటక రంజీ జట్టులో చోటు దక్కింది. మైసూర్ వేదికగా మహారాష్ట్రతో తొలి రంజీ మ్యాచ్ ఆడిన పడిక్కల్.. ఆ మ్యాచ్లో 77 రన్స్ చేశాడు.
పదో తరగతిలో.. కేవలం రెండు నెలలు మాత్రమే చదివిన దేవ్దత్ 96 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. కోవిడ్ కారణంగా లాక్డౌన్ విధించడంతో.. ప్రత్యేక అనుమతితో దేవ్దత్ బీబీఏ నాలుగో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశాడు.
2018 డిసెంబర్ 18న ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ పడిక్కల్ను కొనుగోలు చేసింది. అయినప్పటికీ పడిక్కల్ చాలా కామ్గా.. ఇదేం పట్టనట్టుగా ఉన్నాడు. కానీ పడిక్కల్ తండ్రి బబున్ మాత్రం ఆనందంతో ఎగిరి గంతేశాడు.