యాప్నగరం

IPL 2022 Closing Ceremony‌కి ముస్తాబైన అహ్మదాబాద్ స్టేడియం.. ఈరోజే ఫైనల్

IPL 2022 Final మ్యాచ్‌కి ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో సినీ ప్రముఖులు సందడి చేయబోతున్నారు. శనివారమే అహ్మదాబాద్‌కి చేరుకున్న ఏఆర్ రెహమాన్.. తన టీమ్‌తో కలిసి కాసేపు ప్రాక్టీస్ కూడా చేశారు. అలానే కొరియోగ్రాఫర్...

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 29 May 2022, 11:39 am

ప్రధానాంశాలు:

  • ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
  • మ్యాచ్‌కి ముందు అట్టహాసంగా ముగింపోత్సవం
  • సందడి చేయబోతున్న రణవీర్ సింగ్, ఏఆర్ రెహమాన్
  • గత రెండేళ్లు జరగని ముగింపోత్సవం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Narendra Modi Stadium, Ahmedabad  (Pic Credit: IPLT20.com)
ఐపీఎల్ 2022 సీజన్ ముగింపోత్సవానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ముస్తాబైంది. ఈరోజు రాత్రి 8 గంటలకి గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఈ టైటిల్ పోరుకి ముందు ముగింపోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో పాటూ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా సందడి చేయబోతున్నాడు. అలానే కొరియోగ్రాఫర్ నీతి మోహన్ కూడా తన టీమ్‌లో కలిసి అక్కడ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు ఏఆర్ రెహమాన్, నీతి మోహన్ తమ టీమ్‌లతో కలిసి శనివారం అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన నరేంద్ర మోడీ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 1,32,000‌కాగా.. ఈరోజు ఫైనల్ మ్యాచ్‌కి 1,25,000 మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది. అలానే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలు, మాజీ క్రికెటర్లు, సెలెబ్రిటీలు ఈ ఫైనల్ మ్యాచ్‌ని వీక్షించేందుకు స్టేడియానికి రాబోతున్నారు. దాంతో.. ముగింపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లనీ ఇప్పటికే పూర్తి చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఐపీఎల్ 2020, 2021 సీజన్ ఫైనల్‌ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరగగా.. ఈ రెండు సీజన్లలోనూ ముగింపోత్సవాలు నిర్వహించలేదు.


2020లో ఇదే నరేంద్ర మోడీ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. నాలుగు ఎంట్రీ పాయింట్లతో ఉన్న ఈ స్టేడియం ఏకంగా 63 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2020 వరకూ 90 వేల సీటింగ్ సామర్థ్యంతో ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా ఉండగా.. తాజాగా ఆ రికార్డ్ ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియం పేరిట ఉంది.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.