యాప్నగరం

ఆస్ట్రేలియా క్రికెటర్లకి కొత్త కోచ్ హితబోధ..!

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కి పాల్పడి అపవాదు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా జట్టు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇంగ్లాండ్‌తో

Samayam Telugu 26 May 2018, 3:59 pm
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కి పాల్పడి అపవాదు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా జట్టు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇంగ్లాండ్‌తో జూన్ 7 నుంచి ఆస్ట్రేలియా జట్టు రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో పాటు ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్‌ సన్నద్ధతలో భాగంగా కొత్త కోచ్ జస్టిన్ లాంగర్ ఆటగాళ్లకి హితబోధ చేశాడు. మైదానం లోపల, వెలుపల క్రమశిక్షణతో మెలిగి.. మళ్లీ ఆస్ట్రేలియా జట్టుకి ప్రొఫెషనల్ జట్టుగా గుర్తింపు తీసుకురావాలని క్రికెటర్లకి ఆయన సూచించాడు. బాల్ టాంపరింగ్ వివాదంతో సీనియర్ క్రికెటర్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది నిషేధానికి గురైన విషయం తెలిసిందే. టాంపరింగ్‌కి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కోచ్ డారెన్ లెహ్మాన్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Samayam Telugu australia aims to be worlds most professional team justin langer
ఆస్ట్రేలియా క్రికెటర్లకి కొత్త కోచ్ హితబోధ..!


‘మైదానంలో ఆటగాళ్లు మంచి నడవడికని అలవర్చుకోకపోతే.. ఎంత సంపాదించానా.. ఎన్ని మ్యాచ్‌లు ఆడినా.. ఎన్ని పరుగులు చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అభిమానులు అన్నింటికంటే క్రమశిక్షణకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. మైదానం లోపల, వెలుపల మంచిగా మెలిగితే.. క్రమంగా ఆటగాళ్లపై గౌరవం పెరుగుతుంది. తర్వాత నమ్మకం దానంతట అదే వస్తుంది. ఆస్ట్రేలియా అభిమానులు.. జట్టుని అమితంగా ప్రేమిస్తారు. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా సాధించిన విజయాల్ని చూసి గర్వపడాలి. అంతేగాని.. అందరూ సిగ్గుపడేలా చేయకండి’ అని జస్టిన్ లాంగర్ సూచించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.