దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్, టీ20 సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. చేతన్ శర్మ ఆధ్వర్యంలోని కమిటీ తుది జట్టును ప్రకటించింది. టెస్ట్ కెప్టెన్గా రోహిత్ శర్మ ఉండగా.. టీ20 జట్టుకు కేఎల్ రాహుల్ను సారథిగా వ్యవహరించనున్నాడు. అటు టీ20తో పాటు టెస్ట్ జట్టులోనూ శిఖర్ ధవన్కి చోటు దక్కకపోవడం గమనార్హం. మొన్నటి వరకూ టీ20 జట్టుకి దూరమైన హార్ధిక్ పాండ్యాకి మళ్లీ జట్టులో అవకాశం దొరికింది. కుర్రోళ్లకు అవకాశం
ఐపీఎల్లో అద్భుత పేస్తో సెలక్టర్లని ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్తో పాటు డెత్ ఓవర్లలో పరుగుల కట్టడి చేయగల అర్షదీప్ సింగ్కి టీ20 స్క్వాడ్లో అవకాశం కల్పించారు. దినేష్ కార్తీక్తో పాటు హార్ధిక్, కుల్దీప్ యాదవ్ మళ్లీ జట్టులో చోటు సాధించడం శుభపరిణామం. భువనేశ్వర్ కుమార్తో పాటు హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ పేస్ లీడ్ చేయబోతున్నారు.
శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో పక్కనబెట్టిన పుజారాకి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టులకు మళ్లీ పిలుపువచ్చింది. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్కి కూడా మళ్లీ అవకాశం దక్కింది. బూమ్రా, సిరాజ్, ఉమేశ్, షమీతో పాటు ప్రసిద్ కృష్ణ వంటి బలమైన పేస్తో టీమిండియా రంగంలోకి దిగబోతోంది.
టీ20 స్క్వాడ్
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
టెస్ట్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్ధూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.
ఐపీఎల్లో అద్భుత పేస్తో సెలక్టర్లని ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్తో పాటు డెత్ ఓవర్లలో పరుగుల కట్టడి చేయగల అర్షదీప్ సింగ్కి టీ20 స్క్వాడ్లో అవకాశం కల్పించారు. దినేష్ కార్తీక్తో పాటు హార్ధిక్, కుల్దీప్ యాదవ్ మళ్లీ జట్టులో చోటు సాధించడం శుభపరిణామం. భువనేశ్వర్ కుమార్తో పాటు హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ పేస్ లీడ్ చేయబోతున్నారు.
శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో పక్కనబెట్టిన పుజారాకి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టులకు మళ్లీ పిలుపువచ్చింది. తెలుగు కుర్రాడు కేఎస్ భరత్కి కూడా మళ్లీ అవకాశం దక్కింది. బూమ్రా, సిరాజ్, ఉమేశ్, షమీతో పాటు ప్రసిద్ కృష్ణ వంటి బలమైన పేస్తో టీమిండియా రంగంలోకి దిగబోతోంది.
టీ20 స్క్వాడ్
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
టెస్ట్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్ధూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.