IPL 2021 సీజన్పై బీసీసీఐ ప్లాన్- బి తెరపైకి.. కరోనా, ఎలెక్షన్స్ ఎఫెక్ట్
మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండగా.. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ని విడుదల చేసింది. దాంతో.. ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్లు..?
Samayam Telugu 27 Feb 2021, 8:48 am
ప్రధానాంశాలు:
- ఐపీఎల్ 2021 సీజన్ మొత్తాన్ని మహారాష్ట్రలో.. బీసీసీఐ ఫస్ట్ ప్లాన్
- మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు
- ప్లాన్-బిని తెరపైకి తెచ్చిన బీసీసీఐ.. అయినా కొన్ని చిక్కులు
- బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా వేదికల్లో లీగ్ మ్యాచ్లు
ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్-బిని తెరపైకి తెచ్చింది. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్ల్ని నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా షెడ్యూల్ రూపొందించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. మహారాష్ట్రలోనే టోర్నీ మొత్తం నిర్వహించాలని కూడా భావించింది. ఆ రాష్ట్రంలో నాలుగు క్రికెట్ స్టేడియాలు ఉండటమే ఆ నిర్ణయానికి కారణం. కానీ.. గత కొద్దిరోజుల నుంచి మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. దాంతో.. ప్లాన్- బిని బీసీసీఐ తెరపైకి తెచ్చింది. ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశ మ్యాచ్లను కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తే ఎలా ఉంటుంది..? అని బీసీసీఐ తాజాగా చర్చలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాల అభిప్రాయాల్ని కూడా తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్ని మాత్రం అహ్మదాబాద్లో పునర్నిర్మించిన నరేంద్ర మోడీ (మొతెరా) స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఈ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 1,10,000కాగా.. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే కావడం విశేషం.
బీసీసీఐ ప్లాన్-బిలోనూ ఇప్పుడు ఓ చిక్కు వచ్చి పడింది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్ని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాంతో.. కోల్కతా, చెన్నైలో మ్యాచ్లు, పోలింగ్ తేదీలు క్లాస్ కాకుండా చూసుకోవడం ఇప్పుడు బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా.. పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకూ ఎనిమిది దశలో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మాత్రం ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. షెడ్యూల్పై బీసీసీఐ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ప్లాన్-బిలోనూ ఇప్పుడు ఓ చిక్కు వచ్చి పడింది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్ని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాంతో.. కోల్కతా, చెన్నైలో మ్యాచ్లు, పోలింగ్ తేదీలు క్లాస్ కాకుండా చూసుకోవడం ఇప్పుడు బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా.. పశ్చిమ బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకూ ఎనిమిది దశలో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మాత్రం ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. షెడ్యూల్పై బీసీసీఐ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.