యాప్నగరం

IPL 2020: దూకుడుగా ఆడు.. లేదంటే..? యువ ఓపెనర్‌కు సెహ్వాగ్ సూచన

టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ శుభ్‌మన్‌కు కీలక సూచన చేశాడు. పవర్ ప్లేలో మరింత దూకుడుగా ఆడాలన్నాడు.

Samayam Telugu 18 Oct 2020, 12:28 pm
కోల్‌కతా నైట్ రైడర్స్ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ పవర్ ప్లేలో మరింత దూకుడుగా ఆడాలని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. లేదంటే మేనేజ్‌మెంట్ అతణ్ని మరోస్థానంలో బ్యాటింగ్‌కు దింపాలన్నాడు. ఈ సీజన్లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఆండ్రీ రస్సెల్, దినేశ్ కార్తీక్ పేలవ ఫామ్‌లో ఉన్నారు. గిల్ 8 మ్యాచ్‌ల్లో 275 పరుగులు చేసినప్పటికీ.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా తక్కుగానే ఉంది.
Samayam Telugu sehwag


టాప్ ఆర్డర్‌లో గిల్‌కు చాలా అవకాశాలు ఇచ్చారని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడామని గిల్‌కు చెప్పే సమయం వచ్చింది. అతడు అలా ఆడలేకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపి.. మరొకర్ని ఓపెనర్‌గా పంపాలని వీరూ సూచించాడు. గెలవాలంటే మంచి ఆరంభం అవసరం. పునాది సరిగా లేకపోతే.. బలమైన ఇన్నింగ్స్‌ను నిర్మించలేమని సెహ్వాగ్ తెలిపాడు.

Photo)

తమ బలాలేంటో జట్టు కచ్చితంగా తెలుసుకోవాలని.. తుది జట్టు ఎంపిక విషయమై బలమైన నిర్ణయాలు తీసుకోవాలని వీరూ సూచించాడు. పునాది బలంగా లేకపోతే.. గోడలా కుప్పకూలుతుందన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.