యాప్నగరం

2020 చివరిలోగా అతడు భారత జట్టులో.. ముంబై ఇండియన్స్ క్రికెటర్‌పై ఆకాశ్ చోప్రా జోస్యం

IPL 2020లో Mumbai Indians విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సూర్య కుమార్ యాదవ్.. ఈ ఏడాది ముగిసేలోగా భారత జట్టుకు ఎంపికవుతాడని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు.

Samayam Telugu 13 Oct 2020, 1:24 pm
ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకూ సూర్య కుమార్ యాదవ్ ముంబై తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 7 మ్యాచ్‌ల్లో 233 రన్స్ చేసిన సూర్య కుమార్ యాదవ్.. 38.83 యావరేజ్, 155కిపైగా స్ట్రైక్ రేట్‌తో అదరగొడుతున్నాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిగతా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి కష్టపడుతుంటే.. సూర్య కుమార్ యాదవ్ మాత్రం 32 బంతుల్లోనే 53 రన్స్ చేశాడు.
Samayam Telugu Akash Chopra


ఈ సీజన్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన సూర్య కుమార్ యాదవ్.. లీగ్ దశ మలి భాగంలోనూ ఇలాగే ఆడాలని రోహిత్ శర్మ కోరుకుంటున్నాడు. కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం సూర్యకుమార్ యాదవ్ ఆటతీరుకు ఫిదా అయిపోయాడు. ఈ ఏడాది ముగిసేలోగా యాదవ్ భారత జట్టుకి ఎంపికయ్యే అవకాశం ఉందని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

‘‘ఢిల్లీ, ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ గేమ్ ఛాంజర్‌గా భావిస్తున్నాను. అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు, అతడు కవర్స్ దిశగా అతడు ఆడుతున్న షాట్లు, ఫ్లిక్స్, కట్ షాట్లు అద్భుతం అని అకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో కొనియాడాడు.

‘‘రబాడ బౌలింగ్‌లో ఫ్లిక్ షాట్‌తో సూర్య కుమార్ యాదవ్ సిక్స్ కొట్టిన తీరు అమోఘం. ఆ షాట్‌ను చూసి నేను నమ్మలేకపోయాను. ఈ ఆటగాడు కచ్చితంగా టీమిండియా తరఫున ఆడాలని చెప్పాను. 2020 చివరిలోగా సూర్య కుమార్ యాదవ్ భారత జట్టుకు ఎంపికవడమే.. ఇండియన్ టీంలో ఆడతాడు కూడా అని నాకు అనిపిస్తోంది’’ అని ఆకాశ్ చెప్రా తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.