యాప్నగరం

CSK vs RR, IPL 2020: రెండు బంతుల్లో 27 పరుగులిచ్చిన చెన్నై పేసర్

Rajsthan Royalsతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బౌలర్ లుంగీ ఎంగీడి కేవలం 2 బంతుల్లోనే 27 పరుగులిచ్చాడు. దీంతో రాజస్థాన్ 200 పరుగులు దాటింది.

Samayam Telugu 23 Sep 2020, 2:11 pm
ఐపీఎల్ 2020లో బౌలర్ల తప్పిదాలు జట్లకు ఇబ్బందికరంగా మారాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయ్ శంకర్ రెండు నోబాల్స్ వేసి.. ఒకే బంతికి పది పరుగులు ఇచ్చిన విషయం మరువక ముందే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగీడి 2 బంతుల్లో 27 పరుగులిచ్చాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్‌ చేసిన ఎంగీడి.. గీత దాటి భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
Samayam Telugu ngidi


తొలి బంతిని ఎదుర్కొన్న జోఫ్రా ఆర్చర్.. స్లో బంతిని బలంగా బాది లాంగ్ ఆఫ్ మీదుగా సిక్స్‌ బాదాడు. తర్వాత ఎంగీడి షార్ట్ బాల్ వేయగా.. పుల్ చేసిన జోఫ్రా స్క్వేర్ లెగ్ దిశగా సిక్స్‌గా మలిచాడు. కానీ అది నోబాల్ కావడంతో ఫ్రీ హిట్ కోసం బాల్ వేయగా.. దాన్ని కూడా జోర్డాన్ సిక్స్‌ కొట్టాడు. దురదృష్టవశాత్తూ అది సైతం నోబాల్ కావడంతో.. జోఫ్రా మరోసారి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత ఎంగీడి వైడ్ బాల్ వేశాడు.

Read Also: రాజస్థాన్‌తో మ్యాచ్‌. రాయుడు జట్టులో ఎందుకు లేడు?

దీంతో రెండు లీగల్ డెలివరీలు పూర్తయ్యే సరికి ఎంగిడీ 27 పరుగులు ఇచ్చుకున్నాడు. తర్వాతి మూడు బంతులకు మూడు సింగిల్స్ మాత్రమే రావడంతో.. ఆఖరి ఓవర్లో మొత్తం 30 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్లో జోఫ్రా వరుసగా నాలుగు సిక్సులు బాదడంతో.. రాజస్థాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగలిగింది. ఆర్చర్ 8 బంతుల్లోనే 27 రన్స్ చేశాడు. ఎంగీడి 4 ఓవర్లలో 56 పరుగులిచ్చి కీలకమైన సంజూ శాంసన్ వికెట్ తీశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.