ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై విజయం సాధించిన ధోనీ సేన.. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి ఒత్తిడిలోకి వెళ్లింది. ఢిల్లీపై తిరుగులేని విజయాల రికార్డు ఉన్నప్పటికీ.. శుక్రవారం జరిగిన మ్యాచ్లో చిత్తుగా ఓడటాన్ని చెన్నై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సురైశ్ రైనా జట్టులో లేకపోవడంతోనే.. చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ లయను కోల్పోయిందని భావిస్తున్నారు. అందుకే రైనాను తిరిగి జట్టులోకి తీసుకోవాలని ఫ్రాంచైజీని డిమాండ్ చేస్తున్నారు.
రైనా ప్లీజ్ వచ్చేయంటూ అభిమానులు ట్విట్టర్ ద్వారా అభ్యర్థిస్తున్నారు. కాగా ఈ విషయమై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. సూపర్ కింగ్స్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ‘చిన్న తల’ తిరిగి జట్టులో చేరే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.
కాశీ విశ్వనాథన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. రైనా ‘పర్సనల్ స్పేస్’ను గౌరవించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రావాలని ఫ్రాంచైజీ అతణ్ని అడగబోదని స్పష్టం చేశారు. రైనా కోసం మేం చూడబోం. ఎందుకంటే తనకు తానుగా అతడు ఐపీఎల్కు దూరమయ్యాడు. కాబట్టి అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. రైనా పిలిచే విషయమై మేం ఆలోచించడం లేదని విశ్వనాథన్ వెల్లడించారు.
చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్లో అక్టోబర్ 2న సన్రైజర్స్తో తలపడనుంది. గాయం కారణంగా రెండు మ్యాచ్లకు దూరమైన రాయుడు.. ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది.
రైనా ప్లీజ్ వచ్చేయంటూ అభిమానులు ట్విట్టర్ ద్వారా అభ్యర్థిస్తున్నారు. కాగా ఈ విషయమై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. సూపర్ కింగ్స్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. ‘చిన్న తల’ తిరిగి జట్టులో చేరే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.
కాశీ విశ్వనాథన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. రైనా ‘పర్సనల్ స్పేస్’ను గౌరవించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రావాలని ఫ్రాంచైజీ అతణ్ని అడగబోదని స్పష్టం చేశారు. రైనా కోసం మేం చూడబోం. ఎందుకంటే తనకు తానుగా అతడు ఐపీఎల్కు దూరమయ్యాడు. కాబట్టి అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం. రైనా పిలిచే విషయమై మేం ఆలోచించడం లేదని విశ్వనాథన్ వెల్లడించారు.
చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్లో అక్టోబర్ 2న సన్రైజర్స్తో తలపడనుంది. గాయం కారణంగా రెండు మ్యాచ్లకు దూరమైన రాయుడు.. ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది.