చెన్నై సూపర్ కింగ్స్ కాబోయే కెప్టెన్ విలియమ్సన్..?!
ఐపీఎల్ 2021లో ధోనీ నాయకత్వంలోనే చెన్నై సూపర్ కింగ్స్ బరిలో దిగనుంది. మరి 2022లో ఆ జట్టు కెప్టెన్ ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానం తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం ధోనీ స్థానాన్ని భర్తీ చేయడానికి విలియమ్సన్ సమర్థుడని భావిస్తున్నారు.
Samayam Telugu 9 Nov 2020, 2:45 pm
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ చేరకుండానే లీగ్ దశ నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకూ పదకొండుసార్లు ఐపీఎల్ ఆడిన ధోనీ సేన.. మూడుసార్లు విజేతగా నిలవడంతోపాటు.. ఐదుసార్లు రన్నరప్గా నిలిచింది. కానీ ఈ సీజన్లో మాత్రం పేలవ ఆట తీరుతో.. అన్ని జట్ల కంటే ముందే ప్లేఆఫ్ పోరు నుంచి వైదొలిగి.. పాయింట్ల పట్టికలో ఏడోస్థానంతో సరిపెట్టుకుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో చివరి లీగ్ మ్యాచ్కు ముందు భవిష్యత్తు గురించి ప్రశ్నించగా.. వచ్చే సీజన్లోనూ తానే చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తానని స్పష్టం చేశాడు. ధోనీకి బహుశా వచ్చే ఏడాదే చివరి ఐపీఎల్ సీజన్ కావొచ్చు. అతడి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం ఉన్న జట్టులో ధోనీ తర్వాత ఆ స్థాయి ఆటగాడు డుప్లెసిస్. దక్షిణాఫ్రికా కెప్టెన్గా వ్యవహరిస్తోన్న డుప్లెసిస్ కూల్గా జట్టును ముందుకు నడుపుతాడు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం సన్రైజర్స్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెన్నైకి నాయకత్వం వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఇదే విషయమై ట్వీట్లు చేస్తున్నారు.
అంబటి రాయుడు, డుప్లెసిస్ డిఫెన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేయగా.. భవిష్యత్తు కెప్టెన్ అంటూ యెల్లో జెర్సీలో కేన్ విలియమ్సన్ ఫొటో ఉంచి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సన్రైజర్స్ అతణ్ని వదులుకుంటుందని అనుకోవడం లేదని ఒకరు కామెంట్ చేయగా.. 2022లో మెగా వేలం ఉంది.. అప్పుడు అవకాశం ఉంది బ్రో అంటూ.. చెన్నై అభిమాని బదులిచ్చాడు.
ధోనీ స్థానాన్ని విలియమ్సన్ సరిగ్గా రీప్లేస్ చేస్తాడని కామెంటేటర్ హర్షా భోగ్లే తెలిపాడు. క్రికె బజ్లో ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు స్పందనగా భోగ్లే ఈ సమాధానం ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్కు మంచి కెప్టెన్ అవసరం ఉందన్న భోగ్లే.. డుప్లెసిస్ ఎక్కువ కాలం ఆడలేకపోవచ్చని.. సురేశ్ రైనా పరిస్థితి ఏంటో తెలియదని చెప్పాడు. ఐపీఎల్ ఆరంభంలో భోగ్లే ఈ కామెంట్ చేశాడు.
హర్షా భోగ్లే ఇలా చెప్పడానికి, ఫ్యాన్స్ ఇలా కామెంట్ చేయడానికి కారణం లేకపోలేదు. న్యూజిలాండ్ కెప్టెన్ అయిన కేన్.. 2018లో డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఆడలేకపోయిన తరుణంలో సన్రైజర్స్ ఫైనల్కు చేర్చాడు. కెప్టెన్గా ఎంతో కూల్గా నిర్ణయాలు తీసుకుంటూ.. బ్యాటింగ్లోనూ ఒంటరి పోరాటం చేశాడు. 2019 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ను అతడు ముందుకు నడిపిన తీరును ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఫైనల్లో సూపర్ ఓవర్లో స్కోర్లు సమమయ్యాక.. ఇంగ్లాండ్ను విజేతగా ప్రకటించినప్పటికీ.. అతడి ముఖంపై చిరునవ్వు చెరగలేదు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో చివరి లీగ్ మ్యాచ్కు ముందు భవిష్యత్తు గురించి ప్రశ్నించగా.. వచ్చే సీజన్లోనూ తానే చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తానని స్పష్టం చేశాడు. ధోనీకి బహుశా వచ్చే ఏడాదే చివరి ఐపీఎల్ సీజన్ కావొచ్చు. అతడి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం ఉన్న జట్టులో ధోనీ తర్వాత ఆ స్థాయి ఆటగాడు డుప్లెసిస్. దక్షిణాఫ్రికా కెప్టెన్గా వ్యవహరిస్తోన్న డుప్లెసిస్ కూల్గా జట్టును ముందుకు నడుపుతాడు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం సన్రైజర్స్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెన్నైకి నాయకత్వం వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఇదే విషయమై ట్వీట్లు చేస్తున్నారు.