ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్లు శనివారం నుంచే ప్రారంభంకాబోతున్నాయి. వాంఖడేలోని ముంబయి స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి ఫస్ట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు ఢీకొనబోతుండగా.. గత ఏడాది ఈ రెండు జట్లే ఫైనల్లో ఆడిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కెప్టెన్గా రవీంద్ర జడేజా నడిపించనుండగా.. కోల్కతా నైట్రైడర్స్ టీమ్కి శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై జట్టుని ధోనీ.. కోల్కతా టీమ్ని ఇయాన్ మోర్గాన్ నడిపించారు. కానీ.. రెండు రోజుల క్రితం కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోగా.. ఇయాన్ మోర్గాన్ ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్గా మిగిలాడు. దాంతో.. కెప్టెన్గా జడేజా, శ్రేయాస్ అయ్యర్కి ఈ మ్యాచ్లో కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే? చెన్నై టీమ్దే హవా కనిపిస్తోంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 27 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై టీమ్ 18 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. 8 మ్యాచ్ల్లో మాత్రమే కోల్కతా గెలిచింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? చివరిగా ఆడిన ఐదు మ్యాచ్లకిగానూ.. నాల్గింటిలో చెన్నై గెలిచింది. గత ఏడాది ఫైనల్తో సహా మూడు మ్యాచ్లాడితే మూడింట్లోనూ చెన్నైదే గెలుపు.
చెన్నై, కోల్కతా జట్లు తలపడిన సందర్భాల్లో భారీ స్కోర్లు కూడా నమోదవుతున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. కోల్కతాపై చెన్నై ఇప్పటి వరకూ నమోదు చేసిన అత్యధిక స్కోరు 220 పరుగులుకాగా.. చెన్నైపై కోల్కతా 202 పరుగుల స్కోరుని ఒకసారి చేసింది. గత ఏడాది ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో కోల్కతా టీమ్ 165/9కే పరిమితమైంది. ఈ ఫైనల్లో చెన్నై టీమ్కి ఆడిన ఓపెనర్ డుప్లెసిస్ 86 పరుగులు చేయగా.. ఈ ఏడాది అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి వెళ్లిపోయి కెప్టెన్గా ఆడబోతున్నాడు.
చెన్నై, కోల్కతా జట్లు తలపడిన సందర్భాల్లో భారీ స్కోర్లు కూడా నమోదవుతున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. కోల్కతాపై చెన్నై ఇప్పటి వరకూ నమోదు చేసిన అత్యధిక స్కోరు 220 పరుగులుకాగా.. చెన్నైపై కోల్కతా 202 పరుగుల స్కోరుని ఒకసారి చేసింది. గత ఏడాది ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో కోల్కతా టీమ్ 165/9కే పరిమితమైంది. ఈ ఫైనల్లో చెన్నై టీమ్కి ఆడిన ఓపెనర్ డుప్లెసిస్ 86 పరుగులు చేయగా.. ఈ ఏడాది అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి వెళ్లిపోయి కెప్టెన్గా ఆడబోతున్నాడు.