యాప్నగరం

IPL 2020లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. క్రికెటర్‌ను సంప్రదించిన బుకీ!

ఐపీఎల్ 2020లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. కరప్షన్‌కు పాల్పడాలంటూ తనను సంప్రదించారని ఓ క్రికెటర్ బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగానికి ఫిర్యాదు చేశాడు.

Samayam Telugu 4 Oct 2020, 12:36 pm
ఐపీఎల్ 2020పై మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడాలంటూ తనను సంప్రదించారని ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఓ క్రికెటర్.. బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్‌ (ఏసీయూ)కు సమాచారం ఇచ్చాడు. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈలో బయో సెక్యూర్ వాతావరణంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. బయటి వారెవరూ ఆటగాళ్లను కలిసే అవకాశం లేకపోవడంతో.. మ్యాచ్ ఫిక్సింగ్ అవకాశాలు చాలా వరకు తగ్గాయి.
Samayam Telugu ipl 2020 venue | Image: BCCI/IPL


కానీ ఆన్‌లైన్ ద్వారా మాత్రం బుకీలు ఆటగాళ్లను సంప్రదించే అవకాశాలు సంప్రదించే ఛాన్స్ ఉంది. అవినీతికి పాల్పడాలంటూ తనను సంప్రదించారని.. ఓ ఆటగాడు ఫిర్యాదు చేసిన విషయాన్ని బీసీసీఐ ఏసీయూ చీఫ్, రాజస్థాన్ మాజీ డీజీపీ అయిన అజిత్ సింగ్ నిర్ధారించారు. ఈ వ్యవహారంలో తాము విచారణ ప్రారంభించామని.. పూర్తి విషయాలు తెలియడానికి సమయం పడుతుందన్నారు.

యాంటీ కరప్షన్ ప్రోటోకల్స్ ప్రకారం... ఆటగాడి పేరు లేదా ఫ్రాంచైజీ పేరును గోప్యంగా ఉంచుతారు. ఆటగాళ్లు, సిబ్బంది బయో బబుల్‌లో ఉంటుండంతో.. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఫిక్సింగ్ జరిగే అవకాశం ఉంది. దీంతో ఏసీయూ ఆన్‌లైన్ ద్వారా ఆటగాళ్లను సంప్రదించే బుకీలపై ఓ కన్నేసి ఉంచింది.

క్రికెటర్లందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా యువ క్రికెటర్లు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ను ఎక్కువగా వాడుతుంటారు. ఇదే అదనుగా కొందరు అపరిచితులు అభిమానులమని చెప్పి వారితో స్నేహానికి ప్రయత్నించే అవకాశం ఉంది. భారత క్రికెటర్లు, విదేశీ ఆటగాళ్లు, అన్‌క్యాప్డ్ దేశవాళీ క్రికెటర్లనే తేడా లేకుండా ఆటగాళ్లందరూ అనేకసార్లు యాంటీ కరప్షన్ క్లాసులకు హాజరయ్యారని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఏదో తేడా కొడుతుండటంతో.. ఆటగాడు వెంటనే తమను సంప్రదించాడని... ఏం జరిగిందనే విషయాన్ని తమతో పంచుకున్నాడని ఏసీయూ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.