యాప్నగరం

తొలి మ్యాచ్‌కు ముందు ధోనీ జట్టుకు గుడ్ న్యూస్!

IPL 2020లో Mumbai Indiansతో తొలి మ్యాచ్‌కు ముందు Chennai Super Kingsకు గుడ్ న్యూస్. యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఓసారి కరోనా నెగటివ్ అని తేలింది.

Samayam Telugu 19 Sep 2020, 10:58 am
ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడటానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్ న్యూస్. కరోనా బారిన పడిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు టెస్టుల్లో నెగటివ్ అని తేలింది. నిబంధనల ప్రకారం అతడికి 24 గంటల్లోగా మరోసారి కోవిడ్ టెస్టు చేస్తారు. రెండోసారి కూడా నెగటివ్ అని తేలితే.. ఈ యంగ్ క్రికెటర్ క్వారంటైన్ నుంచి బయటకొస్తాడు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. రుతురాజ్ కొన్ని మ్యాచ్‌లపాటు అందుబాటులో ఉండకపోవచ్చు. బీసీసీఐ నిబంధనల ప్రకారం కరోనా నుంచి బయటపడిన తర్వాత ఆటగాళ్లు ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీంతో రెండు మ్యాచ్‌లు ముగిశాక అతడు జట్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Samayam Telugu Raina - Ruturaj_gaikwad
सुरेश रैना और रितुराज गायकवाड़


2019లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన రుతురాజ్.. ఈ సీజన్లో మూడో స్థానంలో బరిలో దిగే అవకాశం ఉంది. ఈ యువ ఆటగాడు ఇండియా-ఏ, మహారాష్ట్ర జట్లకు రెగ్యులర్ ఓపెనర్‌గా బరిలో దిగేవాడు. కానీ సీనియర్లతో కూడిన చైన్నై జట్టులో రుతురాజ్ మూడో స్థానంలో ఆడే అవకాశం కనిపిస్తోంది. 28 టీ20లు ఆడిన ఈ కుడి చేతివాటం బ్యాట్స్‌మెన్ 843 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం కోసం ఈ యువ బ్యాట్స్‌మెన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. రైనా లేని లోటును రుతురాజ్ భర్తీ చేస్తాడని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది.

టోర్నీ కోసం యూఏఈ వెళ్లిన కొత్తలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన 13 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కరోనా బారిన సంగతి తెలిసిందే. దీంతో మరో వారంపాటు సీఎస్‌కే సభ్యులు ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చింది. పేసర్ దీపక్ చాహర్‌కు కూడా పాజిటివ్ అని తేలినప్పటికీ.. అతడు చాలా రోజుల క్రితమే కోలుకున్నాడు. కానీ ముంబైతో జరిగే ఆరంభ మ్యాచ్‌లో అతడు ఆడే విషయమై స్పష్టత లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.