ఐపీఎల్ 2022 సీజన్లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మళ్లీ విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్తో పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన కనబర్చిన బెంగళూరు టీమ్ 13 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చాలా ఎమోషనల్గా కనిపించాడు. తాజా విజయంతో ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ రేసులోకి మళ్లీ బెంగళూరు వచ్చింది.
మ్యాచ్లో చెన్నై విజయానికి చివరి 12 బంతుల్లో 39 పరుగులు అవసరమవగా.. ఈ దశలో జోష్ హేజిల్వుడ్ చేతికి ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బంతినిచ్చాడు. అయితే.. అప్పుడు క్రీజులో ఉన్న చెన్నై కెప్టెన్ ధోనీ.. అతడ్ని టార్గెట్ చేస్తాడని అంతా ఊహించారు. కానీ.. మొదటి బంతికే ఎవరూ ఊహించనిరీతిలో ధోనీ ఔటైపోయాడు. హేజిల్వుడ్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్స్ కోసం ధోనీ హిట్ చేశాడు. కానీ.. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా వెళ్లి ఫీల్డర్ రజత్ పాటిదర్ చేతుల్లో పడింది. దాంతో.. బెంగళూరు టీమ్ 11 బంతులు మిగిలి ఉండగానే.. మ్యాచ్ గెలిచేసినంత సంబరాలు చేసుకుంది.
ధోనీ వికెట్ దక్కగానే బౌలర్ హేజిల్వుడ్, ఫీల్డర్ రజత్ పాటిదార్ కంటే.. బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువగా సంబరాలు చేసుకుంటూ కనిపించాడు. కానీ.. ధోనీ మాత్రం మౌనంగా పెవిలియన్కి వెళ్లిపోయాడు. దాంతో.. ధోనీ ఫ్యాన్స్ కోహ్లీ సంబరాలపై సెటైరికల్గా స్పందించగా.. కోహ్లీ ఫ్యాన్స్ అతనికి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ 33 బంతుల్లో 3x4, 1x6 సాయంతో 30 పరుగులు చేశాడు. అలానే రవీంద్ర జడేజా, ప్రిటోరియస్ క్యాచ్లను కూడా అందుకున్నాడు.
మ్యాచ్లో చెన్నై విజయానికి చివరి 12 బంతుల్లో 39 పరుగులు అవసరమవగా.. ఈ దశలో జోష్ హేజిల్వుడ్ చేతికి ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బంతినిచ్చాడు. అయితే.. అప్పుడు క్రీజులో ఉన్న చెన్నై కెప్టెన్ ధోనీ.. అతడ్ని టార్గెట్ చేస్తాడని అంతా ఊహించారు. కానీ.. మొదటి బంతికే ఎవరూ ఊహించనిరీతిలో ధోనీ ఔటైపోయాడు. హేజిల్వుడ్ విసిరిన షార్ట్ పిచ్ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్స్ కోసం ధోనీ హిట్ చేశాడు. కానీ.. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా వెళ్లి ఫీల్డర్ రజత్ పాటిదర్ చేతుల్లో పడింది. దాంతో.. బెంగళూరు టీమ్ 11 బంతులు మిగిలి ఉండగానే.. మ్యాచ్ గెలిచేసినంత సంబరాలు చేసుకుంది.
ధోనీ వికెట్ దక్కగానే బౌలర్ హేజిల్వుడ్, ఫీల్డర్ రజత్ పాటిదార్ కంటే.. బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువగా సంబరాలు చేసుకుంటూ కనిపించాడు. కానీ.. ధోనీ మాత్రం మౌనంగా పెవిలియన్కి వెళ్లిపోయాడు. దాంతో.. ధోనీ ఫ్యాన్స్ కోహ్లీ సంబరాలపై సెటైరికల్గా స్పందించగా.. కోహ్లీ ఫ్యాన్స్ అతనికి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్లో కోహ్లీ 33 బంతుల్లో 3x4, 1x6 సాయంతో 30 పరుగులు చేశాడు. అలానే రవీంద్ర జడేజా, ప్రిటోరియస్ క్యాచ్లను కూడా అందుకున్నాడు.