యాప్నగరం

సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన వార్నర్

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా చిక్కుల్లో పడిన డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడని ఫ్రాంచైజీ సీఈవో కె.షణ్ముగం తెలిపారు.

Samayam Telugu 28 Mar 2018, 12:21 pm
బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో కొత్త కెప్టెన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని సన్ రైజర్స్ సీఈవో కె.షణ్ముగం ప్రకటించారు. ఓపెనర్ శిఖర్ ధావన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, బంగ్లా ఆటగాడు షకీబుల్ హసన్‌లలో ఒకరికి కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. 2016లో జట్టుకు టైటిల్ అందించిన వార్నర్‌పై చర్యలు తీసుకునే విషయంలో సన్‌రైజర్స్ ఆచితూచి వ్యవహరించింది. క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు ప్రకటించే దాకా అతడిపై ఎలాంటి చర్య తీసుకోబోమని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చింది.
Samayam Telugu david warner


బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్ ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్‌ల్యాండ్ ఆదేశాల మేరకు బుధవారమే స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లతో కలిసి వార్నర్ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి పయనం అవుతున్నాడు.

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో సూత్రధారి వార్నరే అని వార్తలు వెలువడ్డాయి. తప్పు చేసిన ఆటగాళ్లపై మరో 24 గంటల్లోగా చర్యలు తీసుకుంటామని సదర్‌ల్యాండ్ మంగళవారం రాత్రి తెలిపారు. వార్నర్, స్మిత్‌లను ఏడాదిపాటు క్రికెట్ నుంచి నిషేధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే స్మిత్ కూడా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఏడాది నిషేధం వేటు పడితే వీరిద్దరూ ఐపీఎల్‌కు దూరమైనట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.