యాప్నగరం

IPL 2020: కోహ్లి, రోహిత్‌ను వెనక్కి నెట్టి.. శిఖర్ ధావన్ అరుదైన రికార్డ్

Rajasthan Royalsతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన ధావన్‌ ఐపీఎల్‌లో అత్యధిక అర్ధ శతకాలు బాదిన భారత క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

Samayam Telugu 15 Oct 2020, 8:58 am
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో అత్యధిక అర్ధశతకాలు బాదిన భారత క్రికెటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌పై హాఫ్ సెంచరీ బాదిన ధావన్.. ఐపీఎల్‌లో 39వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ ముందు వరకు సురేశ్ రైనా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ధావన్ 38 చొప్పున హాఫ్ సెంచరీలు చేయగా.. రాజస్థాన్‌పై కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ మిగతా ముగ్గుర్ని వెనక్కి నెట్టేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్ (46) అగ్రస్థానంలో ఉన్నాడు.
Samayam Telugu Shikhar_Dhawan


ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో కొద్దిగా తడబడిన ధావన్.. వరుసగా రెండో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 69 రన్స్‌తో నాటౌట్‌‌గా నిలిచిన ధావన్.. గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కానీ స్లోగా బ్యాటింగ్ చేసి జట్టు ఓటమికి కారణమయ్యాడని ఫ్యాన్స్ ఆరోపించారు.

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 30 బంతుల్లోనే అర్ధ శతకం చేసిన ధావన్.. 33 బాల్స్‌లో 57 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టును ధావన్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.