యాప్నగరం

IPL ఫైనల్‌కు ముందు.. ఢిల్లీ మనో స్థైర్యం దెబ్బతీసేలా.. రోహిత్ వ్యూహాత్మక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ మానసిక స్థైర్యం దెబ్బతీసేలా రోహిత్ శర్మ వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశాడు. బౌల్ట్‌ను ఢిల్లీ నుంచి తెచ్చుకోవడం లక్కీ అంటూ తమ బౌలర్‌పై ప్రశంసలు గుప్పించాడు.

Samayam Telugu 10 Nov 2020, 12:42 pm
ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్‌‌కు ముందు ముంబై ఇండియన్స్ బౌలర్‌ ట్రెంట్ బౌల్ట్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు గుప్పించాడు. కొత్త బంతితో అత్యుత్తమ బౌలింగ్ చేయగల బౌల్ట్‌ను ఢిల్లీ నుంచి కొనుగోలు చేయడం అదృష్టమన్నాడు. బంతిని అద్భుతంగా స్వింగ్ చేసే బౌల్ట్ ముంబై ఇండియన్స్‌లో ఎవర్నీ డిజప్పాయింట్ చేయలేదన్నాడు. ఢిల్లీతో ఫైనల్ ముందు మానసికంగా పై చేయి సాధించేలా రోహిత్ వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
Samayam Telugu ​Rohit Sharma
Rohit Sharma and Shreyas Iyer with the IPL 2020 trophy. (BCCI/IPL Photo)


‘మా జట్టును చూడండి.. జట్టు బలం, సమతూకం చూడండి. నిజాయతీగా చెబుతున్నా ఎవరూ మా బలహీనత ఇదీ అని ఎత్తి చూపలేరు’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఢిల్లీతో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గాయపడి మైదానాన్ని వీడిన బౌల్ట్.. ఫైనల్లో బౌల్ట్ బరిలో దిగుతాడని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్ 22 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కగిసో రబాడ (29) తొలి స్థానంలో ఉండగా.. బుమ్రా 27 వికెట్లతో రెండో స్థానంలో.. బౌల్ట్ మూడో స్థానంలో ఉన్నారు. 2018, 2019 ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన బౌల్ట్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు ముంబై కొనుగోలు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.