సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ఫెనాల్టీ పడింది. అయ్యర్కు రూ.12 లక్షలు ఫైన్ విధించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మినిమం ఓవర్ రేట్ను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. కానీ స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యార్కు ఫైన్ పడింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది తొలి అఫెన్స్ కావడంతో.. రూ. 12 లక్షలు జరిమానాతో సరిపెట్టారు. రెండో సారి ఇదే తప్పిదానికి పాల్పడితే జరిమానా రెట్టింపు కానుంది. ఆ తర్వాత మూడోసారీ స్లో ఓవర్ రేట్కు పాల్పడితే జరిమానాతో పాటు కెప్టెన్పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు.
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో స్లోఓవర్ రేట్ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి సైతం రూ. 12 లక్షలు జరిమానా విధించారు. స్లాగ్ ఓవర్లలో బౌలర్లతో అతిగా సంప్రదింపులు జరపడంతో కోహ్లి.. నిర్ణీత వ్యవధిలోగా బౌలింగ్ కోటా పూర్తి చేయించలేకపోయాడు.
పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ తొలి స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో, ఆర్సీబీ మూడో స్థానంలో, పంజాబ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ముంబై ఐదు, హైదరాబాద్ ఆరు స్థానాల్లో ఉన్నాయి.
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో స్లోఓవర్ రేట్ కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి సైతం రూ. 12 లక్షలు జరిమానా విధించారు. స్లాగ్ ఓవర్లలో బౌలర్లతో అతిగా సంప్రదింపులు జరపడంతో కోహ్లి.. నిర్ణీత వ్యవధిలోగా బౌలింగ్ కోటా పూర్తి చేయించలేకపోయాడు.
పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ తొలి స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో, ఆర్సీబీ మూడో స్థానంలో, పంజాబ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ముంబై ఐదు, హైదరాబాద్ ఆరు స్థానాల్లో ఉన్నాయి.