ఢిల్లీ డేర్డెవిల్స్ ఈ సీజన్లోనూ పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపర్చింది. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో లీగ్ నుంచి వైదొలగనుంది. ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలని ఐపీఎల్ ఆరంభానికి ముందే ఢిల్లీ ఫ్రాంచైజీ భావించింది. అందుకు అనుగుణంగానే కోల్కతాకు రెండు సార్లు కప్ అందించిన గంభీర్ను కెప్టెన్గా, పాంటింగ్ను కోచ్గా తెచ్చి పెట్టుకుంది. కానీ ఈ సీజన్లో ఢిల్లీకి ఏదీ కలిసి రాలేదు. వరుస ఓటముల దెబ్బకు గంభీర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. శ్రేయస్ అయ్యర్ ఆ భారాన్ని మోస్తున్నాడు.
ఢిల్లీ జట్టు వైఫల్యానికి ఆటగాళ్ల ఎంపికే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టు పొందికలో ఆ ఫ్రాంచైజీ విఫలమైందన్నాడు. సత్తా చాటిన దేశవాళీ ఆటగాళ్లను సరిగా వాడుకోవడంలో కోచ్ రికీ పాంటింగ్ ఫెయిలయ్యాడని సన్నీ చెప్పాడు.
ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాక యువ ఆటగాడు అభిషేక్ శర్మకు అవకాశం ఇచ్చారు. విదేశీ ఆటగాళ్ల కంటే అతడెంతో మెరుగ్గా ఆడాడు. దేశవాళీ ఆటగాళ్లను విదేశీ కోచ్ పట్టించుకోలేదు అనడానికి ఇదే నిదర్శనమని సన్నీ చెప్పాడు. ఓవైపు విదేశీ ఆటగాళ్లు విఫలమవుతున్నా.. యువ ఆటగాళ్లను పట్టించుకోలేదని గావస్కర్ విమర్శించాడు. చెన్నైపై గెలవడం ద్వారా ఈ సీజన్లో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఢిల్లీ ఆదివారం ముంబైతో తన చివరి మ్యాచ్ ఆడనుంది.
ఢిల్లీ జట్టు వైఫల్యానికి ఆటగాళ్ల ఎంపికే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టు పొందికలో ఆ ఫ్రాంచైజీ విఫలమైందన్నాడు. సత్తా చాటిన దేశవాళీ ఆటగాళ్లను సరిగా వాడుకోవడంలో కోచ్ రికీ పాంటింగ్ ఫెయిలయ్యాడని సన్నీ చెప్పాడు.
ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాక యువ ఆటగాడు అభిషేక్ శర్మకు అవకాశం ఇచ్చారు. విదేశీ ఆటగాళ్ల కంటే అతడెంతో మెరుగ్గా ఆడాడు. దేశవాళీ ఆటగాళ్లను విదేశీ కోచ్ పట్టించుకోలేదు అనడానికి ఇదే నిదర్శనమని సన్నీ చెప్పాడు. ఓవైపు విదేశీ ఆటగాళ్లు విఫలమవుతున్నా.. యువ ఆటగాళ్లను పట్టించుకోలేదని గావస్కర్ విమర్శించాడు. చెన్నైపై గెలవడం ద్వారా ఈ సీజన్లో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఢిల్లీ ఆదివారం ముంబైతో తన చివరి మ్యాచ్ ఆడనుంది.