ఐపీఎల్ 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఢిల్లీ డేర్డెవిల్స్ ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్ర్కమించిన ఢిల్లీ జట్టు ఫిరోజ్ షా కోట్ల వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో చెన్నైపై 34 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత హర్షల్ పటేల్ (36 నాటౌట్: 16 బంతుల్లో 1x4, 4x6), విజయ్ శంకర్ (36 నాటౌట్: 28 బంతుల్లో 2x4, 2x6) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసిన ఢిల్లీ.. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఛేదనకు దిగిన చెన్నైని 128/6కే పరిమితం చేసింది. చెన్నై జట్టులో ఓపెనర్ అంబటి రాయుడు (50: 29 బంతుల్లో 4x4, 4x6), రవీంద్ర జడేజా (27 నాటౌట్: 18 బంతుల్లో 2x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (17: 23 బంతుల్లో 1x4), సురేశ్ రైనా (15: 18 బంతుల్లో 1x4) మిడిల్ ఓవర్లలో ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో ఆఖర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయి చెన్నై ఓటమి ఖాయమైంది. అయితే.. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్ చేరిన విషయం తెలిసిందే.
అంతకముందు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (17: 17 బంతుల్లో 1x4, 1x6) ఆరంభంలోనే ఔటవగా.. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ (38: 26 బంతుల్లో 3x4, 2x6)తో కలిసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (19: 20 బంతుల్లో 3x4) కాసేపు ఇన్నింగ్స్ నడిపించినా.. ధాటిగా ఆడలేకపోయాడు. వీరిద్దరినీ రెండు బంతుల వ్యవధిలో ఎంగిడి ఔట్ చేయగా.. తర్వాత వచ్చిన హిట్టర్లు మాక్స్వెల్ (5), అభిషేక్ శర్మ (2) పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నారు. దీంతో.. 14.4 ఓవర్లలో 97/5తో ఢిల్లీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఆఖరి వరకూ పట్టుదలతో ఆడిన హర్షల్- శంకర్ జోడి ఐదో వికెట్కి అభేద్యంగా 32 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకి మెరుగైన స్కోరు అందించారు. ముఖ్యంగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన డ్వేన్ బ్రావో బౌలింగ్లో విజయ్ శంకర్ ఒక సిక్సర్ కొట్టగా.. హర్షల్ పటేల్ కళ్లు చెదిరే రీతిలో మూడు సిక్సర్లు బాదడంతో.. ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి.
DD vs CSK LIVE స్కోరు బోర్డు కోసం క్లిక్ చేయండి..!
చెన్నై తుదిజట్టులో కెప్టెన్ ధోనీ ఒక మార్పు చేశాడు. ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీ స్థానంలో లుంగి ఎంగిడిని జట్టులోకి తీసుకోగా.. మరోవైపు ఢిల్లీ జట్టు రెండు మార్పులు చేసింది. ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో మాక్స్వెల్ను, జూనియర్ డాలా స్థానంలో అవేష్ ఖాన్ని జట్టులోకి తీసుకుంది .
చెన్నై జట్టు: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, శామ్ బిల్లింగ్స్, మహేంద్రసింగ్ ధోని, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, లుంగి ఎంగిడి
ఢిల్లీ జట్టు: పృథ్వీ షా, మాక్స్వెల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, హర్షల్ పటేల్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, సందీప్ లామిచ్చానే, ట్రెంట్ బౌల్ట్
అంతకముందు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (17: 17 బంతుల్లో 1x4, 1x6) ఆరంభంలోనే ఔటవగా.. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ (38: 26 బంతుల్లో 3x4, 2x6)తో కలిసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (19: 20 బంతుల్లో 3x4) కాసేపు ఇన్నింగ్స్ నడిపించినా.. ధాటిగా ఆడలేకపోయాడు. వీరిద్దరినీ రెండు బంతుల వ్యవధిలో ఎంగిడి ఔట్ చేయగా.. తర్వాత వచ్చిన హిట్టర్లు మాక్స్వెల్ (5), అభిషేక్ శర్మ (2) పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నారు. దీంతో.. 14.4 ఓవర్లలో 97/5తో ఢిల్లీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఆఖరి వరకూ పట్టుదలతో ఆడిన హర్షల్- శంకర్ జోడి ఐదో వికెట్కి అభేద్యంగా 32 బంతుల్లో 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకి మెరుగైన స్కోరు అందించారు. ముఖ్యంగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన డ్వేన్ బ్రావో బౌలింగ్లో విజయ్ శంకర్ ఒక సిక్సర్ కొట్టగా.. హర్షల్ పటేల్ కళ్లు చెదిరే రీతిలో మూడు సిక్సర్లు బాదడంతో.. ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి.
చెన్నై తుదిజట్టులో కెప్టెన్ ధోనీ ఒక మార్పు చేశాడు. ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీ స్థానంలో లుంగి ఎంగిడిని జట్టులోకి తీసుకోగా.. మరోవైపు ఢిల్లీ జట్టు రెండు మార్పులు చేసింది. ఓపెనర్ జేసన్ రాయ్ స్థానంలో మాక్స్వెల్ను, జూనియర్ డాలా స్థానంలో అవేష్ ఖాన్ని జట్టులోకి తీసుకుంది .
చెన్నై జట్టు: షేన్ వాట్సన్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, శామ్ బిల్లింగ్స్, మహేంద్రసింగ్ ధోని, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, లుంగి ఎంగిడి
ఢిల్లీ జట్టు: పృథ్వీ షా, మాక్స్వెల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, హర్షల్ పటేల్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, సందీప్ లామిచ్చానే, ట్రెంట్ బౌల్ట్